గుడ్ బ్యాడ్ అగ్లీ (GBU) చిత్రంతో తమిళంలో అడుగుపెట్టిన తెలుగు ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్, అజిత్ కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాసర్‌ను అందించడంలో సక్సెస్‌ అయింది. దీంతో అదే బ్యానర్‌తో అజిత్ నెక్ట్స్ సినిమా కూడా అదే బ్యానర్ లో అనే రూమర్స్ మొదలయ్యాయి. కానీ తాజా సమాచారం ప్రకారం… అజిత్ నెక్స్ట్ మేగా ప్రాజెక్ట్‌ను మైత్రీ బ్యానర్‌లో కాదు.

అజిత్ – ఆధిక్ కాంబినేషన్… కాని మైత్రీతో కాదు

‘GBU’ విజయం తర్వాత అజిత్ తన తదుపరి సినిమాను ఆధిక్ రావిచంద్రన్ దర్శకత్వంలో చేయబోతున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌కు వెల్స్ ప్రొడక్షన్ ఫండింగ్ అందించనుంది. ఈ సినిమాకు అంచనా వ్యయంగా రూ. 300 కోట్లు ఖర్చవుతుందని టాక్. ఇందులో సగానికి పైగా బడ్జెట్, అంటే 150+ కోట్లు, అజిత్ రెమ్యూనరేషన్‌గానే ఉంటుందట!

మైత్రీ తప్పుకున్నా… స్కేల్ మాత్రం మాసివ్

ఈ ప్రాజెక్ట్ అధికారికంగా అక్టోబర్ 2025లో సెట్స్‌పైకి వెళ్లనుంది. రిలీజ్ డేట్‌ను సమ్మర్ 2026గా లాక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా… అజిత్ స్టామినా, ఆడియెన్స్‌కు ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుంటే, బాక్సాఫీస్ హంగామా ఖాయమనే ఫీల్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతోంది.

ఫైనల్ గా….

“అజిత్ ఫాలో అప్ ఫిల్మ్ మైత్రీ బ్యానర్‌లో కాదు, కానీ బడ్జెట్‌లో మాత్రం భారీదే!”

తమిళ్ ఇండస్ట్రీలో మైత్రీ మొదటి అడుగే రికార్డు బ్రేకింగ్‌గా ఉండటంతో… వారి తదుపరి మూవీలో అజిత్ ఉండడం ఖాయమనే బజ్ బలంగా ఉండగా, ఇప్పుడు వెల్స్ ఎంట్రీతో equations మారిపోయాయి!

,
You may also like
Latest Posts from