భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారీ పాన్ఇండియా చిత్రం “కాంతారా: చాప్టర్ 1”. మొదటి పార్ట్ విజయంతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ను సంపాదించిన ఈ ఫిల్మ్ రెండో భాగంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
కదంబ రాజవంశం, భక్తి – మానవత్వం – ప్రకృతి అంశాల ముడిపాటుతో తెరకెక్కుతున్న ఈ మిస్టిక్ ఫోల్క్ యాక్షన్ ఫిల్మ్ ఇప్పటివరకూ విడుదలైన టీజర్, ఫస్ట్లుక్ తోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. కానీ… ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ షూటింగ్ స్పాట్ మాత్రం వరుస విషాదాలతో చీకటి ముసురుతోంది!
ఇన్నాళ్లూ ప్రేక్షకులను నవ్వించిన నిజూకు… గుండెపోటుతో మృతి!
కర్ణాటకలోని అగుంబే అడవుల్లో తాజా షెడ్యూల్ జరుపుకుంటున్న సమయంలో, ప్రముఖ హాస్యనటుడు, మిమిక్రీ కళాకారుడు నిజూ కళాభవన్ (55) ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు. కేరళలోని త్రిస్సూర్కు చెందిన ఆయన, మిథిలా హోమ్స్టేలో బసచేస్తుండగా రాత్రి ఛాతినొప్పితో బాధపడినట్లు సిబ్బంది తెలిపారు. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించేలోపు ఆయన ప్రాణాలు కోల్పోయారు.
కాంతారా టీమ్లో ఇది ఇప్పటికే మూడో మరణం!
ఇకపోతే… గత నెలలలో రెండు మరణాలు ఇప్పటికే టీమ్ను దుఃఖంలో ముంచాయి
మే 6: కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్, కొల్లూరు సమీపంలోని సౌపర్ణిక నదిలో విరామ సమయంలో ఈతకు వెళ్లి సుడిగుండంలో చిక్కుకుని మృతి చెందాడు.
మే 12: కన్నడ హాస్యనటుడు రాకేష్ పూజారి, వివాహ వేడుకలో గుండెపోటుతో కుప్పకూలారు. ఆయన కూడా కాంతారా చాప్టర్ 1లో భాగంగా పని చేస్తున్నారు.
కాంతారా 2 పై భారీ అంచనాలు!
2022లో విడుదలై సంచలన విజయం సాధించిన కాంతారా సినిమాకు ఇది ప్రీక్వెల్. ఈ సినిమాకు రిషబ్ శెట్టి మరోసారి దర్శకుడిగా, హీరోగా మాయాజాలం క్రియేట్ చేయటానికి సిద్ధమవుతున్నారు.
హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామా అక్టోబర్ 2, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్కి యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కానీ… నటీనటుల జాబితా ఇంకా అధికారికంగా రివీల్ కాలేదు.
ఒకే ప్రాజెక్ట్లో వరుసగా మూడు ప్రాణాలు పోవడం బహుశా అరుదైన విషాద ఘట్టం కావచ్చు.
కాంతారా టీమ్ ప్రస్తుతం షూటింగ్ను పునః సమీక్షిస్తూ, సిబ్బంది భద్రతపై మరింత శ్రద్ధ చూపుతోంది.
అభిమానులందరూ ఒకే మాట అంటున్నారు –
“ఈ సినిమాను ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తిచేసి, ఆ ముగిసిన ప్రాణాలకు అంకితం చేస్తే అదే నిజమైన నివాళి అవుతుంది.”