చదువు పెద్దగా లేదు… కుటుంబ పరిస్థితి బలహీనంగా ఉంది… బ్రతికే దారి కనిపించని పరిస్థితుల్లో ఒక యువకుడు విజయవాడలో ‘మారుతీ టాకీస్’ అనే సినిమా హాలులో గేట్ కీపర్గా పనిచేశాడు. అదే వ్యక్తి తర్వాత మద్రాస్కి వెళ్లి ఫిల్మ్ సెట్లపై చిన్నచిన్న పనులు చేస్తూ, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ, ఎన్నో అవమానాలను తట్టుకుని, చివరకు 87 సినిమాల నిర్మాతగా ఎదిగాడు.
ఆయనే అట్లూరి పూర్ణచంద్రరావు.
1936లో జన్మించిన ఆయన 1952లో సినిమాల రంగంలో అడుగుపెట్టి, దశాబ్దాల పాటు తెలుగు సినిమా పరిశ్రమకు సేవలు అందించారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో నాగిరెడ్డి – చక్రపాణి అవార్డుకి ఆయనను ఎంపిక చేయడం విశేషం.
ఈ సందర్భంగా ఓ ప్రెవేట్ యుట్యూబ్ ఛానెల్ తో మాట్లాడిన ఆయన తన జీవితంలో ఎదురైన పోరాటాలను, గెలిచిన విజయాలను, ఎదురైన తీపి చేదు అనుభవాలను వర్ణిస్తూ చెప్పారు:
“బతికేందుకు సినిమాలు ఒక్కటే దారి. గేట్ కీపర్గా మొదలయ్యింది నా ప్రయాణం. మద్రాస్ వచ్చాక ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. కానీ, ఆవమానాలే నన్ను ముందుకు నడిపించాయి. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, చివరకు నిర్మాతగా మారాను.”
87 సినిమాల్లో ‘యమగోల’, ‘చట్టానికి కళ్లులేవు’ లాంటి చిత్రాలు పెద్ద విజయాలు సాధించగా, 37 సినిమాలు మాత్రం కష్టాలు తెచ్చిపెట్టినట్టు తెలిపారు.
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లాంటి హీరోలతో తనకు ఉన్న చనువు గురించి చెప్పిన ఆయన:
“నేను ఫోన్ చేస్తే వాళ్లు షూటింగులు మానేసి వచ్చేవాళ్లు,” అని నవ్వుతూ చెప్పారు.
ఒక సినిమా టికెట్ కీపర్ గా గేటు దగ్గర కూర్చున్న ఆయన… తర్వాత సినిమాలను నిర్మించే స్థాయికి ఎదగడం నిజంగా ప్రేరణాత్మకమయ్యే ప్రయాణం!