బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ మృతి చెందారు. ప్రస్తుతం యూకేలో ఉంటున్న ఆయన, పోలో గేమ్ ఆడుతుండగా గుండెపోటుకు గురయ్యారు. గుర్రంపై ఉండగా ఆయన ఆకస్మాత్తుగా తేనెటీగను మింగినట్లు తెలిసింది. దీంతో సంజయ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గుండెపోటుకు దారితీసిందని తెలిసింది. సంజయ్ మృతికి సినీ, వ్యాపార రంగ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

తేనెటీగ కారణమా?

మ్యాచ్ సందర్భంగా తేనెటీగ ఒకటి ఆయన కంఠంలోకి వెళ్లి కుట్టిందని, అదే గుండెపోటుకు దారితీసిందని అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆయన తన సొంత పోలో జట్టు “ఆరియస్” తరఫున ఆడుతున్నారు. ప్రత్యర్థి జట్టు “సుజాన్”, హోటలియర్ జైసల్ సింగ్ ఆధ్వర్యంలో నడుస్తోంది.

బిజినెస్, స్పోర్ట్స్, సోషల్ లైఫ్ – మూడు రంగాల్లోనూ

సంజయ్ కపూర్ వ్యాపార రంగంలోను తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సోనా కోమ్‌స్టార్ సంస్థకు చైర్మన్‌గా ఉన్న ఆయన, ఆటోమొటివ్ టెక్నాలజీ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో కీలక పాత్ర పోషించారు. ఈ కంపెనీకి ఇండియా, యుఎస్‌ఎ, మెక్సికో, సెర్బియా, చైనా లాంటి దేశాల్లో R&D మరియు తయారీ కేంద్రాలు ఉన్నాయి.

కరిష్మా – సంజయ్ జీవితం, విడాకుల తర్వాత ప్రయాణం
సంజయ్, కరిష్మా కపూర్‌లకు సమైరా (కూతురు) మరియు కియన్ (కొడుకు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడాకుల తర్వాత సంజయ్ ప్రియ సచ్ దేవ్ ను వివాహం చేసుకున్నారు.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై చివరి ట్వీట్

మరణానికి కొద్ది గంటల ముందు, సంజయ్ తన X (ట్విట్టర్) ఖాతాలో అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం గురించి స్పందించారు. “Terrible news of the tragic Air India crash in Ahmedabad. My thoughts and prayers are with all the families affected. May they find strength in this difficult hour” అంటూ పోస్ట్ చేశారు. అదే అతని చివరి మెసేజ్‌గా నిలిచింది.

జీవితాన్ని అనుభవించడమే లక్ష్యంగా జీవించిన వ్యక్తి…

అనూహ్యంగా అర్థాంతరంగా తన ప్రయాణాన్ని సంజయ్ ముగించారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, సహచరులకు మనఃపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాం.

, , ,
You may also like
Latest Posts from