మణిరత్నం – కమల్ హాసన్ కలయిక అంటే దక్షిణ భారత సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక శకం. ‘నాయకుడు’ అనే లెజెండరీ క్లాసిక్ తర్వాత మళ్లీ ముప్పై ఏళ్ల తర్వాత వీరిద్దరూ చేతులు కలిపారు. అదే ‘థగ్ లైఫ్’. కానీ ప్రేక్షకులు ఎదురు చూసింది కలల కలయిక కాదు… నిరాశే!
విమర్శకుల్ని మెప్పించలేకపోయింది. సాధారణ ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేయలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా… బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయింది. ఈ ఫలితం కమల్ హాసన్, మణిరత్నంలకు తీవ్ర షాక్ ఇచ్చిందనే వార్తలు బయటకొచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.
తాజాగా… ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్లో ‘థగ్ లైఫ్’ను వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు.
సినిమా విడుదలకు ముందు ఎగ్జిబిటర్లతో చేసిన ఒప్పందం ప్రకారం ఎనిమిదువారాల వరకూ ఓటీటీలో విడుదల చేయబోమని నిర్మాతలు చెప్పినప్పటికీ… ఇప్పుడు ఆ డీల్ను పక్కన పెట్టారు. నెట్ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను రూ.110 కోట్లకు పైగా చెల్లించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.