అక్కినేని అఖిల్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. జూన్ 6న హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగిన వేడుకలో తన ప్రేయసి జైనాబ్ రవ్‌జీని వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన రెండు రోజుల తర్వాత జరిగిన రిసెప్షన్ మాత్రం రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.

వివాహానంతరం అఖిల్ తల్లిదండ్రులు నాగార్జున, అమల, అన్నయ్య నాగ చైతన్య, వదిన శోభిత సోషల్ మీడియాలో వివాహ చిత్రాలను, అభినందన సందేశాలను పంచుకున్నారు. అయితే, అఖిల్ మాత్రం ఇప్పటికీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివాహం గురించి ఎలాంటి పోస్ట్ చేయకపోవటం అంతటా హాట్ టాపిక్ గా మారింది.

గతేడాది ఎంగేజ్‌మెంట్ తర్వాత జైనాబ్‌తో కలిసి ఒక ఫోటో షేర్ చేసినప్పటికీ, అప్పటి నుండి అతను సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల తన రాబోయే చిత్రం “లెనిన్” పోస్టర్‌ను పోస్ట్ చేయడం మినహా, అతని ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త అప్‌డేట్స్ లేవు.

తన వివాహ ఫోటోలను షేర్ చేయకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అఖిల్ తన వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచాలని, లైమ్ లైట్ నుండి దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను కెరీర్ పరంగా కాస్త కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో తన ఉనికిని గణనీయంగా తగ్గించుకున్నారు. అయినప్పటికీ, అభిమానులు తమ అభిమాన నటుడు తన వివాహానికి సంబంధించిన కనీసం కొన్ని క్షణాలనైనా పంచుకుంటాడని ఆశించారు.

అఖిల్ త్వరలో “లెనిన్” షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ చిత్రం ఈ సంవత్సరం చివర్లో విడుదల కానుంది.

, , , ,
You may also like
Latest Posts from