సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్నారు. డైరెక్టర్ ఎస్‌వీ కృష్ణారెడ్డికి పుట్టినరోజు వేడుకలో కమెడియన్ అలీపై ఆయన చేసిన అసభ్యకరమైన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

“ఎక్కడ ఆ లం* కొ*కు” అని అనడం పై ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై రాజేంద్రప్రసాద్ ఇప్పటికే స్పందిస్తూ, తన మాటలు సరదాగా మాత్రమే ఉంటాయని, దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ ఖర్మ అని అన్నారు.

ఈ వివాదంపై తాజాగా అలీ స్పందించారు. ఆయన ఒక వీడియో ద్వారా రాజేంద్రప్రసాద్ బూతులపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఆయన కావాలని అలా మాట్లాడలేదని, అనుకోకుండా మాట తూలిందని తెలిపారు. ఆయన కుమార్తె మరణంతో బాధలో ఉన్నారని అన్నారు.

అలీ మాట్లాడుతూ… ”ఎస్‍వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో అనుకోకుండా రాజేంద్రప్రసాద్ కి మాట తూలింది. సరదాగా అన్న మాటలను మీడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు. ఆయన మంచి ఆర్టిస్ట్. పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన కూతురు పోయింది. అమ్మలాంటి బిడ్డ చనిపోవడంతో అలా అయ్యారు. ఆయన కావాలని చెప్పింది కాదు. ఆయన పెద్దాయన. ప్లీజ్.. ఎవరూ దీన్ని పెద్దది చేయకండి” అని అలీ విజ్ఞప్తి చేసారు.

,
You may also like
Latest Posts from