అనేక దశాబ్దాల తర్వాత కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్ మళ్లీ కలిసి క్రేజ్ క్రియేట్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి నిర్మించిన భారీ చిత్రం ‘థగ్ లైఫ్’ రేపే విడుదల కానుంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్ రిలీజ్కి సిద్ధమవుతోంది. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వస్తున్న ఈ ప్రాజెక్ట్ రకరకాల వివాదాలును మోసుకొచ్చింది. మరీ ముఖ్యంగా కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ అవ్వటం లేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఎంత అయ్యింది, లాభ , నష్టాలు ఏమిటో చూద్దాం.
నిర్మాణ వ్యయం దాదాపు రూ. 200 కోట్లు (ప్రచార ఖర్చులతో సహా) అని సమాచారం.
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… రిలీజ్కి ముందే ఈ సినిమా పూర్తిగా బ్రేక్ ఈవెన్ అయిందని వినికిడి.
నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ను రూ. 130 కోట్లకు సొంతం చేసుకుంది.
టీవీ సాటిలైట్ హక్కులు రూ. 60 కోట్లు,
మ్యూజిక్ హక్కులు రూ. 20 కోట్లు
ఈ డీల్లతో కలిపి నిర్మాతలకు మొత్తంగా రూ. 210 కోట్లు రాబడి లభించింది.
ఇది విడుదలకు ముందే వచ్చిన ఆదాయం. ఇకపై థియేటర్ల ద్వారా వచ్చే లాభం పూర్తిగా కమల్ హాసన్ – మణిరత్నం లకు లభించనుంది. అంటే ఈ సినిమాతో వీరిద్దరూ మంచి ప్రాఫిట్స్ రాబట్టే అవకాశం ఉంది. నిజంగా చెప్పాలంటే, థగ్ లైఫ్ రిలీజ్కి ముందే గేమ్ ఛేంజ్ చేసేసింది!