కల్యాణ్ రామ్ హీరోగా చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి. హిట్, ఫ్లాఫ్ లకు సంభదం లేకుండా కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ప్రదీప్ చిలుకూరి అనే కొత్త డైరక్టర్ ని పరిచయం చేస్తూ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి’. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

కల్యాణ్ రామ్ స‌ర‌స‌న హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్ మెటీరియల్, టైటిల్ పోస్టర్, ఇటీవ‌ల వదిలిన ప్రీ-టీజర్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మేక‌ర్స్‌ టీజర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్ కలిపి మరీ టీజర్ ని రిలీజ్ చేసారు.

అజనీశ్‌ లోకనాథ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ లో హైలైట్ .

టీజ‌ర్‌లో విజయశాంతి వైజయంతి అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించగా.. ఆమె కొడుకు పాత్రలో కల్యాణ్ రామ్ కనిపించారు. నెక్స్ట్ పుట్టిన‌రోజు నాటికి పోలీస్ గా ఖాకీ డ్రెస్ లో చూడాలని వైజయంతి తన కుమారుడిని కోరుతుంది. అయితే, కొన్ని అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అవ్వాల్సిన హీరో… కత్తి పట్టుకొని రౌడీల మీద యుద్ధానికి బయలుదేరినట్లు టీజ‌ర్‌లో చూపించారు

అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సోహైల్ ఖాన్ విలన్ గా న‌టించారు. శ్రీకాంత్ మేక, బబ్లూ పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు.

, ,
You may also like
Latest Posts from