సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా మే 30 న ఖలేజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ-రిలీజ్ కు రంగం సిద్దం అయిన సంగతి తెలసిందే. సంవత్సరాలు,జనరేషన్స్ మారినా ‘ఖలేజా’పై ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ తిక్పం అడ్వాన్స్ బుకింగ్స్ మామూలుగా లేవు — ఫ్యాన్స్ ఎగబడి టికెట్లు తీసుకుంటుండటంతో రికార్డ్ స్థాయిలో ప్రీ-సేల్స్ నడుస్తున్నాయి.
“ఖలేజాను తానే ఫ్యాన్స్ దెబ్బగొట్టారు!” – సి.కళ్యాణ్
ఈ రేంజి క్రేజ్ నేపథ్యంలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో నిర్మాత సి. కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన బోల్డ్గా చెప్పారు
“2010లో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద ముంచినవారు మహేష్ బాబు ఫ్యాన్స్. వాళ్లు సినిమాపై ఒకరకమైన అంచనాలతో వచ్చారు. కానీ సినిమా తీరుగా వేరే ఉండటంతో నిరాశపడ్డారు.”
అంతే కాక, అప్పట్లో చాలా మంది ఫ్యాన్స్ నేరుగా తనకు ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చారట. మిక్స్డ్ టాక్ను ఎదుర్కొన్న ఖలేజా ఇప్పుడు మళ్ళీ వారి కోసమే తిరిగొస్తుందంటే, అదో ఆధ్యాత్మిక పరిణామంలా ఉందంటున్నారు.
“బహుశా ఖలేజా తన గౌరవాన్ని పొందాల్సిన సమయం ఇప్పుడే రాసి ఉండొచ్చూ. అప్పట్లో మిస్ అయిన అభినందనలు ఇప్పుడు రావాలని ఆశిస్తున్నా,” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికి 1500 సార్లు బుల్లి తెరమీద ప్రదర్శించి రికార్డ్ సృష్టించిన సినిమా ఖలేజా అని సీ కళ్యాణ్ చెప్పారు.
ఇప్పటికి యూత్ ఈ సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు. సినిమాలో ఉన్న సీతారాం పాత్ర మహేష్ బాబు కు చాలా దగ్గర ఉంటుందన్నారు. సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అన్నారు.
మే 30 వ తేదీన థియేటర్ లు బద్దలు అవుతాయి అన్నారు. రీ రిలీజ్ సినిమాల్లో ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రేయేట్ చేస్తుంది అన్నారు. అలాగే నిర్మాత శింగనమల రమేష్ మాట్లాడుతూ.. సినిమా అందరిని అలరిస్తుంది అని చెప్పారు.