‘కన్నప్ప’ అనేది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలెట్టేముందు ఎవరికీ పెద్దగా ఎక్సపెక్టేషన్స్ లేవు. రిలీజ్ టైమ్ నాటికి సినిమాపై కొద్దిగా క్రేజ్ మొదలైంది. ‘కన్నప్ప ను ఓ భారీ పాన్ ఇండియా సినిమాగా తీస్తున్నా’ అంటూ ఈ ప్రాజెక్ట్ లోకి ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి వాళ్లు ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో తనని ట్రోల్ కి గురి చేస్తున్నా, వెటకారంగా కామెంట్లు చేస్తున్నా విష్ణు పట్టించుకోలేదు. కానీ రిలీజ్ తర్వాత ట్రోలింగ్ మొదలవుతుందని, నెగిటివ్ కామెంట్స్, రివ్యూలు వస్తాయని ముందు జాగ్రత్త తీసుకోవటం కోసం ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మంచు విష్ణు టీమ్ మీడియాతో పాటు సినిమా విమర్శకులకు స్పష్టమైన హెచ్చరికను జారీ చేసింది.అఫీషియల్గా రిలీజ్ చేసిన నోట్లో, టీమ్ ఏమంటుందంటే?
“కన్నప్ప సినిమా విడుదలకు అవసరమైన అన్ని అనుమతులు మేము పొందాము. విమర్శకులు ముందుగా మా సినిమా చూసి, చిత్రంలోని కంటెంట్ను గౌరవించాలి. మా సినిమా ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, తమ అభిప్రాయాలను చెప్పవచ్చు. అయితే, ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాను లక్ష్యంగా చేసుకొని నెగిటివ్గా రివ్యూలు చేస్తే, వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం.”
“భావ ప్రకటన స్వేచ్ఛను మేము గౌరవిస్తాము. కానీ ద్వేషపూరిత విమర్శలు, వ్యక్తిగత దూషణలను తట్టుకోలేం. ఇటీవల కేరళ హైకోర్టు పేర్కొన్నట్లుగా, సృజనాత్మక కళను ఉద్దేశపూర్వకంగా కించపరచడం నేరం.” అలాగే, ఈ సినిమా సంబంధించిన చిత్రాలు, వీడియోలు, సీన్లు వంటి వాటిని సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ ప్లాట్ఫారమ్ల్లో అనుమతి లేకుండా షేర్ చేయడాన్ని తీవ్రంగా నిషేధించారు. “అలా చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం” అని స్పష్టంగా తెలియజేశారు.
ఇప్పుడు సినిమాకి ముందే ఇలాంటి స్ట్రాంగ్ లీగల్ షీల్డ్ పెట్టడాన్ని బట్టి చూస్తే… మంచు విష్ణు ఈసారి ట్రోలింగ్ని తేలికగా తీసుకోబోతోన్నట్టు స్పష్టం అవుతోంది. ‘కన్నప్ప’ చుట్టూ తిరుగుతున్న ప్రచారం, పోస్టులు, సోషల్ మీడియా కామెంట్లను నిఘా పెట్టి చూస్తూ… అవసరమైతే న్యాయబద్ధంగా కౌంటర్ ఇవ్వడానికే సన్నద్ధమవుతున్నట్టుంది.