
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షాకింగ్ డీల్! నెట్ఫ్లిక్స్తో రూ. 125 కోట్ల ఒప్పందం.. కానీ ఆ కండిషన్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టు, అప్పుడే రికార్డు స్థాయి బిజినెస్తో ట్రేడ్ వర్గాలను విస్తుపోయేలా చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఏకంగా రూ. 125 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అయితే, ఈ భారీ డీల్ వెనుక నెట్ఫ్లిక్స్ పెట్టిన ఒక వింత కండిషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
రూ. 500 కోట్లు వస్తేనే ఫుల్ పేమెంట్!
సాధారణంగా సినిమాలు ఫ్లాప్ అయినా, హిట్ అయినా ఓటీటీ సంస్థలు ముందే ఒప్పందం చేసుకున్న మొత్తాన్ని చెల్లిస్తాయి. కానీ, నెట్ఫ్లిక్స్ ఇప్పుడు రూట్ మార్చింది. తాజా ఒప్పందం ప్రకారం.. ‘డ్రాగన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తేనే ఆ రూ. 125 కోట్లు మేకర్స్కు అందుతాయి. ఒకవేళ వసూళ్లు తగ్గితే, నెట్ఫ్లిక్స్ ఇచ్చే అమౌంట్ కూడా తగ్గిపోతుంది. అదే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి అంతకంటే ఎక్కువ వసూళ్లు రాబడితే, అదనంగా బోనస్ కూడా ఇచ్చే వెసులుబాటు ఉందట.
ఎన్టీఆర్ & నీల్ పై పెరిగిన ప్రెజర్?
ప్రస్తుతం జోర్డాన్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తోడైతే రూ. 500 కోట్లు అనేది పెద్ద కష్టం కాదని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఓటీటీ డీల్ నేరుగా థియేట్రికల్ పెర్ఫార్మెన్స్తో ముడిపడి ఉండటంతో చిత్రబృందంపై అదనపు ఒత్తిడి పడినట్లయింది.
భారీ తారాగణం.. అదిరిపోయే మ్యూజిక్!
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో మెరవనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ గత చిత్రం ‘దేవర’ కూడా నెట్ఫ్లిక్స్లో మంచి ఆదరణ పొందడంతో, ఈ సినిమాపై సాలిడ్ అంచనాలు ఉన్నాయి.
