
చనిపోయే ముందు పెట్టిన ఆ వీడియోలో ఏముంది?’పవన్ కల్యాణ్ హటావో’ రచయిత మృతి వెనుక అసలు రహస్యం!
ఖమ్మం: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘పవన్ కల్యాణ్ హటావో – పాలిటిక్స్ బచావో’ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మరణించడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ వద్ద జరిగిన ఈ ఘటన కేవలం ప్రమాదమేనా? లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
అసలు ఏం జరిగింది? (The Suspicious Accident)
హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న శ్రీనివాస్ కారు పాలేరు రిజర్వాయర్లోకి దూసుకెళ్లింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కారు వెనుక భాగం మాత్రమే నీటిలో మునిగింది. కారు తోలిన డ్రైవర్ సురక్షితంగా బయటపడగా, వెనుక సీట్లో కూర్చున్న శ్రీనివాస్ మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతుండటంతో ఈ కేసు మరింత చిక్కుముడిగా మారింది.
మరణానికి ముందు పెట్టిన ఆ ‘చివరి వీడియో’ సంచలనం!
బొగ్గుల శ్రీనివాస్ మరణానికి కొన్ని గంటల ముందే సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన వైసీపీ నేత, మాజీ జడ్జి జడ శ్రవణ్ కుమార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
“అమరావతి విషయంలో జడ శ్రవణ్ కుమార్ మాట మారుస్తున్నారు.”
“చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ రాజధానిని నిర్మించకుండా దుర్మార్గానికి పాల్పడుతున్నారు.”
అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో పెట్టిన వెంటనే ఆయన ప్రమాదానికి గురవ్వడం కాకతాళీయమా లేక పక్కా స్కెచ్తో జరిగిన హత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పవన్ కల్యాణ్పై పుస్తకంతో రికార్డులు!
గతంలో పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీనివాస్ రాసిన పుస్తకం ఏకంగా 8.5 లక్షల కాపీలు అమ్ముడుపోయి అప్పట్లో ఒక రికార్డు సృష్టించింది. ఆ ఏడాది అత్యధిక పుస్తకాలు అమ్ముడైన రచయితగా ఆయన గుర్తింపు పొందారు. అమరావతి రాజధాని విషయంలో కూడా ఆయన తన గళాన్ని బలంగా వినిపించేవారు.
పోలీసుల దర్యాప్తు.. బయటపడ్డ గాయాలు!
శ్రీనివాస్ భౌతిక కాయాన్ని పరిశీలించిన వారికి ఆయన నుదురు , ముఖంపై గాయాలు కనిపించాయి. ఇది యాక్సిడెంట్లో జరిగిన గాయాలా లేక ఎవరైనా దాడి చేసి రిజర్వాయర్లో పడేశారా? అన్న కోణంలో పోలీసులు అన్ని యాంగిల్స్లోనూ విచారిస్తున్నారు. డ్రైవర్ను పట్టుకుంటేనే అసలు నిజం బయటపడే అవకాశం ఉంది.
