హనుమాన్’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో తేజ సజ్జా. ఇప్పుడాయన నుంచి రానున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. రితిక నాయక్ హీరోయిన్. మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజై మంచి క్రేజ్ తెచత్చుకుంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కు పెట్టిన బడ్జెట్ విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మిరాయ్ సినిమా మొత్తం నిర్మాణ ఖర్చు (రెమ్యునరేషన్లు సహా) సుమారుగా రూ. 40 కోట్లలోపే ముగిసినట్టు తెలిసింది. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. దర్శకుడు, నిర్మాతల పక్కా ప్లానింగ్ ప్రకారం వెళ్లటమే అందుకు కారణం అంటున్నారు.
తక్కువ బడ్జెట్తో అధ్బుతమైన అవుట్పుట్ ఇవ్వడం అనేది నిర్మాతలకు ఆనందం కలిగించే విషయం. రిస్క్ లేకుండా బిజినెస్ చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది.
ఇప్పటికే హనుమాన్ సినిమాతో సుమారు రూ. 300 కోట్ల వరల్డ్వైడ్ గ్రాస్ సాధించిన తేజ సజ్జా, ప్రస్తుతం విజయాల పరంపరలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు మిరాయి ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
ఈ చిత్రం ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా ఉండనుంది. తేజ ఇందులో సూపర్ యోధగా కనువిందు చేయనున్నారు. ఈ సినిమాకి గౌర హరి సంగీతమందిస్తున్నారు.