తాజాగా థియేటర్ల పై నిషేధం నిర్ణయం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై పెద్దగా ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యక్తిలో టాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.

జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్దమైన హరిహర వీరమల్లూ సినిమా విషయంలో ఈ పరిస్థితి మరింత ఆవేశాన్ని తెచ్చిందని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో ఆ చర్య సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైంది.

ముఖ్యంగా, ఈ మధ్యలో జూన్‌లో చాలా సినిమాలు రిలీజ్ కావబోతున్నప్పటికీ హరిహర వీరమల్లూ ఒక్కటే అనటం పెద్ద పొరపాటు అంటున్నారు. టాలీవుడ్‌లో ఎవరూ సినిమాలకు సంబంధించి రాజకీయ వివాదాల కారణంగా పని చేయరు. అందులోనూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికార పక్షణంలో ,డిప్యూటీ సీఎం స్దాయిలో ఉన్నారు. అలాంటప్పుడు ఆయనపై ఎవరు కుట్ర చేస్తారు.ఆయన ఆగ్రహించటంలో అర్దం లేదని అంటున్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ సినిమా, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కొందరు వ్యక్తుల మీద విమర్శలు చేశారు. ఇది కొంత మందికి ఇబ్బందిగా అనిపించింది.

ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ తన మంత్రిని involve చేయడం మంచిదే. అంతేకాదు, అవిశ్వాసపూరిత వ్యాఖ్యలు, ఆధారాలు లేకుండా ఆరోపణలు వేయడం సరికాదు. ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పినట్లే, ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు తమదైన ప్రయాణం ఉంటుందని స్పష్టంగా చెప్పాడు.

,
You may also like
Latest Posts from