టాలీవుడ్‌లో ‘డీజే టిల్లు’ సినిమాతో పెద్ద గుర్తింపు పొందిన హీరో సిద్దు జొన్నలగడ్డ, ఆ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా, అతని మార్కెట్‌ ను బాగా పెంచింది. ఈ సక్సెస్ తో తన రెమ్యూనరేషన్‌ను కూడా సిద్దు పెంచుకున్నాడు. అయితే, అదే ఇప్పుడు అతడికి విమర్శల రూపంలో ఎదురవుతోంది.

తాజాగా విడుదలైన ‘జాక్’ అనే సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. దీనికి బాధ్యత వహిస్తూ, సిద్దు తన పారితోషికంలో సగం డబ్బు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. కానీ అతనిపై ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. దీనిపై పరిశీలిస్తే, కావాలని కొందరు టార్గెట్‌ చేసినట్టు అనిపిస్తోంది.

ఒక నటుడు లేదా దర్శకుడు పెద్ద హిట్ సాధించిన తర్వాత పారితోషికం పెంచుకోవడం సహజం. ఇది ఒక్క సిద్దుకే కాదు – ఇండస్ట్రీలో సాధారణమే. పైగా, ఇటీవల టాలీవుడ్‌లో విజయాల శాతం తక్కువగానే ఉంది.

సిద్దు చేసినది తప్పేమీ కాదు. విజయాన్ని ప్రేరణగా తీసుకొని ముందుకెళ్తున్న యంగ్ హీరోలను ప్రోత్సహించాలి కానీ, ఓ ఫెయిల్యూర్‌తోనే దారుణమైన విమర్శలు చేయడం సమంజసం కాదు అని అతని అభిమానులు అంటున్నారు.

, ,
You may also like
Latest Posts from