స్టార్ హీరో ధనుష్ దూకుడు ఆగేలా లేదు! హిట్-Flop లను లెక్క చేయకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ వర్సటైల్ యాక్టర్… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘కుబేర’ గా రాబోతున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది!
ధనుష్ + రష్మిక + నాగార్జున: పవర్ ప్యాక్ కాంబో!
ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా, కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున ట్రైలర్లో వేరే లెవెల్ పవర్ చూపించారు. ధనుష్ – రష్మిక కాంబినేషన్ స్క్రీన్ మీద మంచి కెమిస్ట్రీ చూపించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ధనుష్ తొలిసారి డీఎస్పీ మ్యూజిక్లో పాట పాడాడు!
ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రత్యేకత ఏమిటంటే… ఈ సినిమాతో ధనుష్ తొలిసారి డీఎస్పీ సంగీతంలో ఓ పాట పాడాడు. అభిమానుల్లో ఇది మరో హైప్ క్రియేట్ చేస్తోంది.
బిచ్చగాడు కథలో కుబేర కిక్కు!
ట్రైలర్ చూస్తే ఇది సాధారణ కథ కాదు అనిపిస్తుంది. బిచ్చగాడిలా జీవించే ఓ వ్యక్తి, ఓ ప్రభుత్వాన్ని సైతం కుదిపేస్తాడు. విలన్లు అతన్ని వెతుక్కుంటూ పడిపోతారు. కానీ అంతలోనే ట్విస్ట్ – ఆ బిచ్చగాడు ఎవరు? ఎందుకు వేట మొదలైంది? అతని గతం ఏమిటి? అన్నది ఎంతో ఆసక్తిగా చూపించారు.
ఒక ధనికుడు ప్రపంచాన్ని ఎలా శాసిస్తాడు, ఓ పేదవాడు తన ప్రపంచాన్ని ఎలా గెలుస్తాడు అనే సబ్జెక్టును ఎమోషన్, మిస్టరీ, సోషల్ డైలమాతో చూపించబోతున్నట్టు ట్రైలర్ టోన్ చెబుతోంది.
థియేటర్లలోకి ఎప్పుడు?
‘కుబేర’ సినిమా జూన్ 20న వరల్డ్వైడ్ థియేటర్లలో విడుదల కానుంది.
ధనుష్ దర్శకత్వం వహించిన ‘రాయన్’ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో… అంచనాలు దూసుకుపోతున్నాయి!
నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush), రష్మిక మందన్న (Rashmika) కాంబోలో తెలుగు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో మొదటిసారిగా పాన్ ఇండియాగా తెరకెక్కిన చిత్రం ‘కుబేర’ (Kuberaa). సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. రాక్స్టార్ దేవీశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం సమకూర్చాడు.
జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచిన మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన పాటలు, గ్లిమ్స్ టీజర్ మూవీపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలను రెండింతలు పెంచింది. ఈ క్రమంలో హైదరాబాద్ జేఆర్సీ సెంటర్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ను చూస్తే.. ఇటీవల విడుదల చేసిన టీజర్ను మించి గూస్బమ్స్ వచ్చే సన్నివేశాలతో తీర్చదిద్దినట్లు, ఏదో పెద్దగానే ఫ్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. ధనుష్, రష్మిక వారి పాత్రలకు వారే డబ్బింగ్ చెప్పగా ధనుష్ ఓ పాట సైతం ఆలపించడం విశేషం. దేవీ శ్రీ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా ఉంది.