హిట్, ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా ముందుకు వెళ్తున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘కుంగువా’, ‘రెట్రో’ వంటి పాన్-ఇండియా స్థాయి చిత్రాలు చేస్తున్న ఆయన, త్వరలో మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌ కోసం సిద్ధమవుతున్నట్టు సమాచారం. తాజా ఇండస్ట్రీ బజ్ ప్రకారం… మలయాళ్ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ చిత్ర దర్శకుడు జితు మాధవన్ దర్శకత్వంలో సూర్య నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

‘రోమాంచం’తో దర్శకుడిగా సత్తా చాటిన జితు మాధవన్, ‘ఆవేశం’తో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. కథల ఎంపికలో వైవిధ్యం, వినూత్నంగా నేరేషన్ ఇవ్వగల శక్తి అతనికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఆయనతో కలిసి సినిమా చేయబోతున్నట్టు టాక్‌.

ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత కాలైపులి ఎస్. థాను నిర్మించనున్నట్టు సమాచారం. ‘అసురన్’, ‘కబాలి’, ‘వైర’ వంటి విజయవంతమైన చిత్రాలకు బ్యాకింగ్ ఇచ్చిన థాను, ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్స్‌పైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం సూర్య తన 45వ చిత్రాన్ని ఆర్జే బాలాజీ దర్శకత్వంలో పూర్తి చేయనున్నాడు. మరో ప్రక్క వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో మరో సినిమా కూడా లైన్‌లో ఉంది. ఈ రెండు పూర్తయిన తరువాతే జితు మాధవన్ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నాడని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అయితే, మలయాళ్–తమిళ్ ఇండస్ట్రీల కలయికలో పాన్ ఇండియా స్థాయిలో మరో విభిన్నమైన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

,
You may also like
Latest Posts from