రామ్చరణ్ – బుచిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ గత కొన్నిరోజులుగా ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గ్లింప్స్లో కనిపించిన క్రికెట్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ క్రేజ్ను గమనించిన ఓటిటి దిగ్గజం నెట్ఫ్లిక్స్, ఇప్పుడు ఈ సినిమాకు డిజిటల్ హక్కులు సొంతం చేసుకుంది.
ప్రస్తుతం హైదరాబాద్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. భారీ ట్రైన్ సెట్ చేసి, ఓ మాస్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. లొకేషన్లో రామ్చరణ్ లుక్కు సంబంధించి ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇతర సినిమాలు థియేట్రికల్ కాకుండా ప్రీ-బిజినెస్ డీల్ చేయడంలో వెనుకబడుతున్న వేళ, ‘పెద్ది’ మాత్రం భారీగా ప్రీ రిలీజ్ డీల్స్ క్లోజ్ చేస్తోంది. మ్యూజిక్ రైట్స్ను ప్రముఖ సంస్థ టి-సిరీస్ భారీ ధరకు సొంతం చేసుకోగా, డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు సమాచారం. ఈ డీల్ విలువ రూ. 110 కోట్లు వరకు ఉండొచ్చని టాక్.
మొత్తానికి నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా ఈ సినిమా రూ. 200 కోట్ల వరకు రాబట్టే అవకాశముంది. దాంతో, ఫైనల్ బడ్జెట్లో సగానికి పైగా ఇప్పుడే రికవర్ అయిపోయినట్టే.
ఈ భారీ చిత్రం 2026, మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది.