బాలీవుడ్ స్టార్ కృతి సనోన్ తన టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఆమె చెల్లెలు నుపుర్ సనోన్ మాత్రం ఇప్పటివరకు పెద్దగా క్లిక్ అవ్వలేదు. మార్కెట్ లో జోష్ కనబర్చలేకపోయింది.
తెలుగు ప్రేక్షకులకు ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో రవి తేజకి జోడీగా పరిచయమైన నుపుర్, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో నటిగా కెరీర్ లో స్పీడు అందుకోలేదు. ఇక ‘కన్నప్ప’ సినిమాలో తొలుత ఎంపికై, కొన్ని రోజులు షూటింగ్ చేసినప్పటికీ, చివరికి ప్రీతి ముకుందన్ ఆమె స్థానాన్ని దక్కించుకుంది.
నటనకు బ్రేక్ ఇచ్చిన నుపుర్, తాజాగా ఫ్యాషన్ ప్రపంచంలో అడుగుపెట్టి “Nobo” అనే తన స్వంత బ్రాండ్ను లాంచ్ చేసింది. కానీ ఈ బ్రాండ్ ధరల్ని చూసి నెటిజన్లు literal షాక్లో పడ్డారు!
ఒక మామూలు ఫ్యాషన్ డ్రెస్కి ₹20,000 నుంచి ₹30,000 వరకు ధర వసూలు చేయడమే కాకుండా, దాని క్వాలిటీ, డిజైన్ పరంగా ప్రత్యేకత ఏమీ లేదని యూజర్లు చెబుతున్నారు. “అసలే రిచ్ లుక్ లేదు, ఓరిజినాలిటీ లేదు, అయినా ఇంత ఖరీదు ఏంటి?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక కృతి సనోన్ తన చెల్లెలు బ్రాండ్కి బలంగా మద్దతు ఇవ్వడంతో ఆమెపై కూడా ట్రోలింగ్ మొదలైంది. “కృతి ఫేమ్ను క్యాష్ చేసుకోవడానికే ఇలా చేస్తున్నారేమో” అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ వివాదంపై నుపుర్ గానీ, కృతి గానీ స్పందించలేదు. అయితే నెటిజన్ల ట్రోలింగ్ మాత్రం ఇంకా ఆగని పరిస్థితి.