టాలీవుడ్‌ హీరోయిన్ సమంత ప్రస్తుతం తెరపై కనిపించకపోయినా, ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో మాత్రం ఓ యుద్ధమే చేస్తున్నట్టుంది. ఆమె పోస్ట్‌ చేసిన ప్రతి వాక్యం ఇప్పుడు ఓ ‘పాస్‌వర్డ్’లా మారింది – వెనక అర్థం కోసం అభిమానులే కాదు, ఇండస్ట్రీ జనాలూ తలలు పట్టుకుంటున్నారు!

తాజాగా సమంత తన ఇన్‌స్టాలో ఓ షాకిచ్చే పదజాలంతో కూడిన మెసేజ్‌ను షేర్ చేసింది:

‘‘ఇతరుల మాటలను పట్టించుకోకుండా నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రశాంతత కోసం పోరాడొద్దు. జరగాల్సిన దాన్ని జరగనివ్వండి. నేను చేయాల్సిన పని – తప్పకుండా చేయాల్సిందే అనే స్థాయికి నన్ను నన్నే మలుచుకోవాలి.’’

ఇంతలో ఆమె మరో పోస్ట్ పెట్టింది:

‘‘మనమిచ్చే గౌరవానికి, మనపై వచ్చే ఒత్తిడికి మధ్య బౌండరీ లైన్ ఖచ్చితంగా ఉండాలి. మన శక్తిని ఎవరూ తీసుకోనివ్వొద్దు’’ అని

ఇవి చదివినవారికి ఒక్కసారిగా ఫ్లాష్‌ బ్యాక్ లోకి వెళ్లిపోతున్నారు – ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితాన్ని చుట్టుముట్టిన వార్తలవైపు.

ఇన్‌స్టాలో వాక్యాలు… బయటి ప్రపంచానికి సంకేతాలా?

ఇటీవల సమంత – రాజ్‌ నిడిమోరుల మధ్య రిలేషన్ ఉందంటూ ప్రచారం సాగుతోంది. దుబాయ్ ట్రిప్, అప్‌లోడ్ చేసిన ఫోటోలు, అదే సమయంలో రాజ్‌ భార్య శ్యామాలి చేస్తున్న సందేశాత్మక పోస్టులు… ఇవన్నీ కలిపి చూస్తే సమంత పోస్ట్‌కి అది రియాక్షనా? లేక రిటాలియేషనా? అన్న చర్చకు తెరలేచింది.

శ్యామాలి ఇటీవల పోస్ట్ చేసిన పోస్ట్:

“నమ్మకం అన్నది విలువైనది. అది పోతే… ఎంత సంపదతోనైనా తిరిగి తేలేరు!”

ఇవి చదివాక సమంత స్టోరీలో ‘ఆత్మగౌరవం’, ‘బౌండరీలు’, ‘విషాదంలో ప్రశాంతత’ అనే పదాలు రావడాన్ని యాధృచ్ఛికంగా తీసుకోలేమన్న అభిప్రాయమే ఫాలోవర్స్‌లో ఉంది.

సమంత… శబ్దం లేని యుద్దం చేస్తోందా?

ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడే సమంత… ఇప్పుడు మాటల్లో మౌనం, కానీ స్టేట్మెంట్స్‌లో స్ట్రాంగ్‌గా ఉంది. ఇది ఆమె మైండ్‌ఫైట్ అన్నమాట. వ్యక్తిగత జీవితంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా, ప్రత్యేకమైన పదాలతో తన భావాల్ని బయటపెడుతున్నారు. ఇది “నిశ్శబ్ద యుద్ధం”, అది ప్రతి స్టోరీలో ఒక్కో రౌండ్ లా మారుతోంది.

You may also like
Latest Posts from