గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేత అంశం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. జూన్ 1న ధియేటర్ల బంద్ నిర్వహించాలని అనుకున్న కొందరు .. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో వెనక్కి తగ్గారనే వార్తలు వచ్చాయి.

అయితే ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టకూడదని డిసైడ్ అయిన పవన్ .. దీని వెనుక ఎవరున్నా వదలబోమనే సంకేతాలు ఇచ్చారు. దీనిలో భాగంగా జనసేన పార్టీకి చెందిన కీలక నేత, రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అత్తి సత్యనారాయణపై వేటు వేశారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.

అయితే దిల్ రాజు అతని తమ్ముడిని కాపాడుకోవడానికి నాపై నిందలు వేశారు అంటూ జనసేన పార్టీ నుండి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన వ్యాఖ్యలలో ముఖ్యాంశాలు.

ఇటీవల జూన్ 1వ తేదీన థియేటర్ల బంద్ అని ప్రకటన రావడానికి ప్రధాన కారణమని అత్తి సత్యనారాయణను పార్టీ నుండి సస్పెండ్ చేసిన జనసేన

థియేటర్ల బంద్ అని నేను ఎక్కడా ప్రస్తావించలేదు

థియేటర్ల బంద్ అని ప్రకటించిందే దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి, అతని తమ్ముడిని కాపాడుకోవడానికి నాపై నిందలు వేశారు

దిల్ రాజు కమల్ హసన్ ని మించిపోయేలా నటించి, పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వగానే జనసేన పార్టీ పేరు ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెచ్చాడు – జనసేన బహిష్కృత నేత అత్తి సత్యనారాయణ.

,
You may also like
Latest Posts from