సినిమా వార్తలు

నైజాంలో ఉస్తాద్ ‘మాస్’ స్కెచ్: థియేటర్లు దడదడలాడాల్సిందే!

బాక్సాఫీస్ దగ్గర గబ్బర్ సింగ్ గర్జన మొదలవ్వకముందే మైత్రీ మూవీ మేకర్స్ ఊహించని స్కెచ్ వేశారు. నిజాం గడ్డపై పవన్ కళ్యాణ్ మేనియాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేలా మేకర్స్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

రీసెంట్ టైమ్స్‌లో ఏ పెద్ద సినిమా వచ్చినా టికెట్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడు థియేటర్ మెట్లు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి. కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో సీన్ రివర్స్ అయింది. ఎక్స్‌ట్రా హైక్స్ లేవు, అదనపు భారాలు లేవు. కేవలం నార్మల్ ప్రైసింగ్‌తోనే నిజాం బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్లాన్ రెడీ అయిపోయింది.

మైండ్ బ్లాక్ చేసే స్ట్రాటజీ:

నిజానికి భారీ బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచుకోవడం కామన్, కానీ హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబోపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఆడియన్స్‌కు చేరువ కావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. టికెట్ ధరలు అందుబాటులో ఉండటంతో థియేటర్ల దగ్గర జన జాతర ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పక్కన శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్ యాడ్ అవ్వడం, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడవడంతో హైప్ ఇప్పటికే పీక్స్‌లో ఉంది.

మార్చి 19న రచ్చ షురూ:

అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే ఓపెన్ అయ్యాయి. ఎర్లీ మార్నింగ్ షోల కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు, పవన్ కళ్యాణ్ స్వాగ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం గ్యారెంటీ. రేట్లు పెంచకపోవడం వల్ల రిపీట్ ఆడియన్స్ పెరిగి, కలెక్షన్ల వర్షం కురవడం పక్కా!

ఈ నిర్ణయం వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను తిరగరాసే అవకాశం ఉంది. మీ టికెట్స్ బుక్ చేసుకున్నారా మరి?

Similar Posts