
ధనుష్ పై ₹20 కోట్ల కేసు! కోర్టు మెట్లు ఎక్కిన స్టార్ ప్రొడక్షన్ హౌస్.. అసలు ఏం జరిగిందంటే?
చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ చుట్టూ ఇప్పుడు ఒక భారీ వివాదం ముసురుకుంది. వరుస సినిమాలతో, డైరెక్షన్లతో బిజీగా ఉన్న ఈ హీరోకి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకంగా 20 కోట్ల రూపాయల పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
పదేళ్ల క్రితం ఒప్పందం.. నేటికీ మొదలవ్వని షూటింగ్!
అసలు విషయం ఏంటంటే.. 2016లో తమిళ చిత్ర పరిశ్రమలోని దిగ్గజ నిర్మాణ సంస్థ ‘తేనాండల్ ఫిల్మ్స్’ (Thenandal Films) బ్యానర్లో ధనుష్ ఒక సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ‘నాన్ రుద్రన్’ అనే టైటిల్తో ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. ఈ చిత్రానికి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించి, నటించాల్సి ఉంది. అయితే పదేళ్లు గడుస్తున్నా ఆ ప్రాజెక్టు అతీగతీ లేకపోవడంతో సదరు నిర్మాణ సంస్థ సీరియస్ అయ్యింది.
తేనాండల్ ఫిల్మ్స్ ఆరోపణలు ఇవే:
అగ్రిమెంట్ జరిగి దశాబ్దం దాటినా, కనీసం స్క్రిప్ట్ కూడా తమకు ఇవ్వలేదని ప్రొడక్షన్ హౌస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
తమ సినిమాను పక్కన పెట్టి, ధనుష్ ఇతర సినిమాలకు డేట్స్ ఇచ్చి కాల్షీట్స్ కేటాయిస్తున్నారని ఆరోపిస్తోంది.
దీనివల్ల తమకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందని, అందుకే ₹20 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపింది.
తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మరింత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రొడక్షన్ హౌస్ ధనుష్ను హెచ్చరించింది.
సైలెంట్గా ఉన్న ధనుష్!
ఈ లీగల్ నోటీసులపై ధనుష్ టీమ్ నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ప్రస్తుతం ధనుష్ వరుసగా తన 55వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ‘అమరన్’ ఫేమ్ రాజ్కుమార్ పెరియాసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఓ పక్క చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్, ఇప్పుడు ఈ ₹20 కోట్ల వివాదాన్ని ఎలా సెటిల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
