డీజే టిల్లు సినిమాలతో యూత్ స్టార్గా ఎదిగిన సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత టిల్లు స్క్వేర్ సినిమాతోనూ హిట్ కొట్టారు. అయితే ఇటీవల “జాక్” అనే సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. ట్రైలర్స్కు బాగానే రెస్పాన్స్ వచ్చినా, ఫైనల్ ఔట్పుట్ కలిసి రాలేదు. సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది.
అయితే… ఈ ఫ్లాప్ సినిమాకు సంబంధించి సిద్ధూ తీసుకున్న ఓ డెసిషన్ అతనిపై అభిమానుల గౌరవాన్ని ఒక్కసారిగా పెంచేసింది.
రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న సిద్ధూ… 4 కోట్లు వెనక్కిచ్చాడు!
“జాక్” సినిమా కోసం సిద్ధూ రూ. 8 కోట్లు రెమ్యూనరేషన్గా తీసుకున్నాడు. సినిమా డిజాస్టర్ అవడంతో, నిర్మాతకు భారీ నష్టం వచ్చింది.దీనికి స్పందనగా సిద్ధూ తన పారితోషికంలో సగం అంటే రూ. 4 కోట్లు వెనక్కి ఇచ్చేశాడు! ఆ డబ్బును నిజాం డిస్ట్రిబ్యూషన్ చేసిన ఏషియన్ సునీల్కు ఇచ్చి సెటిల్ చేయనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం సిద్ధూ, నీరజా కోనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “తెలుసు కదా” షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, దీపావళి సందర్భంగా విడుదల కానుంది. తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సిద్ధూకి మరో రెండు భారీ సినిమాలు లైన్లో ఉన్నాయి.