బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ — ముగ్గురు టాలీవుడ్ నటులు… మళ్లీ తెరపైకి రీఎంట్రీ ఇస్తూ చేసిన మాస్ యాక్షన్ డ్రామా “భైరవం”, అంచనాలు, ప్రమోషన్ల పరంగా ఆశాజనకంగా కనిపించినా… బాక్సాఫీస్ దగ్గర మాత్రం నిరాశపరిచింది.
సూపర్ కాస్ట్… స్ట్రాంగ్ బజ్… అయినా ఫలితం?
తమిళ బ్లాక్బస్టర్ “గరుడన్” రీమేక్గా వచ్చిన “భైరవం” శుక్రవారం రిలీజైంది. భారీ ప్రచారం, పవర్పుల్ ట్రైలర్తో ఓ మాస్ మసాలా హిట్ వస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అదే రోజున మహేష్ బాబు “ఖలేజా” రీ-రిలీజ్ మరియు ఐపీఎల్ మ్యాచులు “భైరవం”ని పూర్తిగా దెబ్బ కొట్టాయి.
కలెక్షన్ల క్రాష్: శుక్రవారం నుంచి మంగళవారానికి డౌన్ ఫాల్
ఈ సినిమాకు ఓపినింగ్స్ యావరేజ్ గా ఉన్నాయి. దాంతో మొదటి రోజు నుంచే కలెక్షన్లు ఆశించిన స్థాయికి చేరలేదు. వీకెండ్లో కూడా ట్రెండ్ మారలేదు. మండే, ట్యూస్డే రోజుల్లో సినిమాకు డ్రాప్ బాగా కనపడింది. IPL 2025 ఫైనల్ మ్యాచు ప్రభావం సినిమాని పూర్తిగా దెబ్బతీశింది.
ఇన్వెస్టర్లకు షాక్ – కేవలం 30-40% రికవరీ
నిర్మాత కె.కె. రాధామోహన్ ముందుగానే సినిమా రిస్క్ఫ్రీగా విడుదల చేయాలని, అడ్వాన్స్ బేసిస్లో రిలీజ్ చేశారు. కానీ… 30 కోట్ల బడ్జెట్తో రూపొందిన సినిమా ఇప్పటివరకూ మొత్తం పెట్టుబడిలో 30 శాతం మాత్రమే రికవర్ చేసింది. ఫైనల్ రన్ ముగిసే సరికి ఇది 40 శాతం వరకు రికవరీ అయ్యే అవకాశం ఉంది.