మొన్న సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్టైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వెంకటేష్ మళ్లీ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్ అతడి కెరీర్‌లోనే బెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత వెంకీ బాగా సెలెక్టివ్‌గా ప్రాజెక్టుల్ని అంగీకరిస్తున్నాడు. ఎన్నో కథలు విన్న ఆయన… చివరికి మూడు భారీ ప్రాజెక్టులకు ఓకే చెప్పారు. అవేమిటంటే…

మొదటిగా, మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో వెంకటేష్ కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కి వెంకటేష్ ఒక నెల రోజుల డేట్లు కేటాయించగా, త్వరలో ఆయన పాత్ర షూటింగ్ పూర్తవుతుంది.

ఇక రెండో ప్రాజెక్ట్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆగస్టులో షూటింగ్ మొదలు పెట్టి, 2026 సమ్మర్ రిలీజ్‌ను లక్ష్యంగా ఉంచారు. వెంకీకి ఇది రీసెంట్ టైమ్ లో మళ్లీ స్టైలిష్ & ఎమోషనల్ చిత్రంగా టాక్ వినిపిస్తోంది.

మూడో సినిమా మాత్రం పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందే దృశ్యం 3. మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కనుంది. మోహన్‌లాల్‌, వెంకటేష్‌, అజయ్ దేవగన్‌ ముగ్గురూ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది.

ప్రస్తుతం వెంకటేష్ ఈ మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికారిక సమాచారం. మళ్లీ మాస్, ఎమోషన్, క్లాస్ – అన్నీ కలిపి ‘విక్టరీ’ వెంకటేష్ ప్రేక్షకులను అలరించబోతున్నాడు!

, , ,
You may also like
Latest Posts from