సందీప్ రెడ్డి వంగా vs దీపికా పదుకొనే వివాదం ఇప్పుడు బాలీవుడ్ మొత్తాన్ని రంగంలోకి దింపుతోంది. అయితే ఈ వివాదంపై చాలామంది సినీ ప్రముఖులు మాత్రం… అట్లానే సైలెంట్గా తప్పించుకుంటున్నారు.కానీ కొంతమంది బాలీవుడ్ స్టార్స్ మాత్రం తమ స్టైలులో దీపికకు మద్దతు పలుకుతున్నారు. అది ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా స్పందిస్తూ సందీప్ రెడ్డికి నెగెటివ్ ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారు.
రీసెంట్ గా కాజోల్ – అజయ్ దేవగన్ కూడా తాజాగా తమ సినిమా ప్రమోషన్స్లో ఇదే అంశంపై స్పందించారు. మీడియా వారు అడిగిన ప్రశ్న:
“కొత్తగా తల్లి అయిన నటీమణులకు ఎనిమిది గంటల షిఫ్ట్నే పాటించాలన్న నిబంధనపై మీ అభిప్రాయం?”
కాజోల్ సమాధానం ఇచ్చేలోపే, అజయ్ దేవగన్ మైక్ తీసుకుని ఇలా చెప్పారు:
“నిజాయితీ గల ఫిలిం మేకర్ ఎవరు కూడా దానికి వ్యతిరేకంగా ఉండరు. అందరూ కూడా ఎనిమిది తొమ్మిది గంటల పని కే ఒప్పుకుంటారు . చాలామంది అర్థం చేసుకుంటారు కూడా.. ప్రెసెంట్ ఇండస్ట్రిలో అదే పాటిస్తున్నాం .. అయితే ఇది పర్సన్ టూ పర్సన్ వేరే వేరేగా ఉంటుంది” ” అని చెప్పుకొచ్చాడు.
దాంతో క్లారిటీగా అజయ్ కావాలని దీపిక వైపు మాట్లాడాడని, సందీప్ రెడ్డిపై ఇండైరక్ట్ సెటైర్స్ వేసాడని అర్దం అయ్యింది.
అసలు వివాదం ఎలా మొదలైంది?
సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న ‘స్పిరిట్’ సినిమాకు తొలుత దీపిక పదుకొనేనే హీరోయిన్గా భావించారు. కథనంగా బోల్డ్ కంటెంట్ ఉండటం వల్ల మొదట ఆమె ఈ ప్రాజెక్ట్కి ఓకే చెప్పలేదట. కానీ సందీప్ ఆమె కంఫర్ట్ జోన్లోనే చిత్రీకరిస్తామని నచ్చజెప్పారట.
ఆ తర్వాతే అసలు సమస్య వచ్చిందట – దీపికా రిమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేయడం, అలాగే కొన్ని వింత కండిషన్లు పెట్టడం వల్ల తాను వెనక్కి తగ్గినట్టు సందీప్ చెప్పారట.
“ఈ టైమ్ కి వస్తా, ఆ టైమ్ కి వెళ్తా”
“నాకు నచ్చిన కాస్ట్యూమ్స్ మాత్రమే వేసుకుంటాను”
“నా ఫ్రెండ్స్ ఖర్చులూ మీరే భరిస్తే నేనొస్తా” అంటూ చాలా ‘డిమాండింగ్’గా ప్రవర్తించిందని వంగా టీం లో ఒకరు బయట పెట్టినట్టు టాక్.
ఇది చూసిన సందీప్ – ఆమెను తప్పించి త్రిప్తి దిమ్రీను తీసుకున్నట్టు సమాచారం. అయితే దీపికతో జరిగిన సంగతుల్ని సందీప్ పీఆర్ టీం డీటెయిల్స్గా బాహాటంగా లీక్ చేసిందని బాలీవుడ్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ఈ వార్తలపై ఘాటుగా స్పందించిన సందీప్…
“సినిమా మొత్తం లీక్ అయినా నాకేం ఫరక్ పడదు” అంటూ సోషల్ మీడియాలో షార్ట్ అండ్ సవేజ్ పోస్ట్ పెట్టాడు.
అక్కడినుంచి మొదలైన గొడవ ఇంకా చల్లబడలేదు!