‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయిలో తన క్రేజ్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లిన అల్లు అర్జున్, ఇప్పుడు ప్రతి అడుగూ ఆచితూచి వేస్తున్నాడు. అందులో భాగంగానే త్రివిక్రమ్‌తో ముందుగా అనుకున్న ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టి, తమిళ మాస్ డైరెక్టర్ అట్లీ చేతిలో ఒక మాస్ బిగ్‌బజ్ ఫిల్మ్ పెట్టాడు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ-లుక్ వీడియోలే అటు ఇండస్ట్రీలో, ఇటు ఫ్యాన్స్ లో హైప్ నెమ్మదిగా పెంచుతున్నాయి.

ఇదే సమయంలో అల్లు అర్జున్ తర్వాత ఏ దర్శకుడితో పని చేస్తాడు అన్న దానిపై పలురకాల గాసిప్‌ల మధ్య, ఇప్పుడు ఒక కొత్త వార్త తెరపైకి వచ్చింది. అది ఏంటంటే… ప్రభాస్ కోసం ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్‌ ‘డ్రీమ్ ప్రాజెక్ట్’ ‘రావణం’ని ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోతున్నారట.

రీసెంట ్గా నిర్మాత దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో “2026లో అల్లు అర్జున్‌తో ఒక పెద్ద సినిమా మొదలు పెడతాం” అని వెల్లడించారు. కానీ ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఈ వార్త బయటికి వచ్చింది. అదే ఈ ‘రావణం’ గుసగుస.

ప్రశాంత్ నీల్ అసలు ప్లాన్ ‘రావణం’ అనే పీరియడ్ మాస్ యాక్షన్ డ్రామాను ప్రభాస్‌తో తీసే ఉద్దేశ్యంతోనే ఉన్నాడట. కానీ ప్రభాస్ ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్‌కి ప్రక్కన పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు. పైగా ఎన్టీఆర్‌తో చేసే ‘డ్రాగన్’ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత చూస్తే ప్రభాస్ కాల్షీట్లు వెంటనే దొరికేలా లేవు.

అయితే ఇదే గ్యాప్‌లో అల్లు అర్జున్ కి ఆ అవకాశం దొరికినట్టు ఇప్పుడు చర్చ. ప్రభాస్ కాల్షీట్లు చూస్తే ఆలస్యం అయ్యేలా ఉందని అర్థం కావడంతో, ప్రశాంత్ నీల్ తన డ్రీమ్ స్క్రిప్ట్‌ను అల్లు అర్జున్‌తోనే తీసేందుకు సిద్ధమయ్యాడట. దీనికి దిల్ రాజు కూడా ప్రొడ్యూసర్‌ అని టాక్.

ఈ కాంబినేషన్ ఫైనలైజ్ అయితే… బన్నీకి ఇది ఫ్యూచర్ డెఫైనింగ్ ప్రాజెక్ట్ అవ్వడం ఖాయం. ఎందుకంటే కేజీఎఫ్, సలార్ సినిమాలతో పాన్-ఇండియా ఆడియన్స్‌కు డైరెక్ట్ కనెక్ట్ అయిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు తన స్టైల్‌లోని క్లాసిక్ విలన్ కథను బన్నీతో చేస్తే ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం!

ఇదంతా జరుగుతుందా? లేక కేవలం రూమర్‌గానే మిగిలిపోతుందా? అన్నది త్వరలో తేలనుంది. కానీ ప్రభాస్ కోసం సిద్ధం చేసిన “రావణం” ఇప్పుడు అల్లు అర్జున్‌కి ఓపెన్ అవుతుందా? అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

, , , , ,
You may also like
Latest Posts from