మెగాస్టార్ చిరంజీవి తన వినోదాత్మక చిత్రంతో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ “మన శంకర వరప్రసాద్ గారు” రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే సినిమా విడుదల కంటే ముందే చిత్ర యూనిట్‌కు మరియు అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.

పెయిడ్ ప్రీమియర్స్ ఖరారు!

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ షోల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు (జనవరి 11) రాత్రి 8 గంటల నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. ఈ షోలకు సంబంధించి టికెట్ ధరను రూ. 600 గా ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రాజాసాబ్ అనుభవంతో జాగ్రత్తలు..

ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా విషయంలో ప్రీమియర్ షోల అనుమతులు మరియు టికెట్ ధరల పెంపుపై ఏర్పడిన గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి మేకర్స్ ముందుగానే జాగ్రత్త పడ్డారు. ఎక్కడా అడ్డంకులు లేకుండా పక్కా ప్లానింగ్‌తో ప్రభుత్వం నుండి అనుమతులు సంపాదించారు. మరోవైపు, సాధారణ షోల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఈ రోజు నుండే అన్ని మేజర్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి రానున్నాయి.

భారీ తారాగణం: అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, క్యాథరిన్ థ్రెసా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ఒక కీలక అతిథి పాత్రలో మెరవబోతుండటం విశేషం. భీమ్స్ సంగీతాన్ని సమకూర్చగా, సాహు గారపాటి మరియు సుస్మిత సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

#Chiranjeevi, #Mana Shankara Vara Prasad Garu, #telangana government, #The Raja Saab, #Ticket Hike

By admin