తెలుగు చిత్రసీమలో ప్రభాస్ అంటే ఒక స్పెషల్ . సినిమాలు తీసే తీరులో కాదు, వ్యక్తిత్వంలోనూ… ఆయన సింప్లిసిటీ, హ్యూమిలిటీ, క్లాస్ హ్యాండ్లింగ్కి ఫేమస్. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో ఒక్కటైనా వివాదంలో పడిన రికార్డ్ లేదు. ఎప్పుడూ కూల్గా, క్లియర్గా ఉండే వ్యక్తిత్వం వల్లే ప్రభాస్కు ‘క్లీజ్ ఇమేజ్’ అనే పేరుంది. కానీ ఇప్పుడు ఆయన చేయబోయే సినిమా స్పిరిట్ చుట్టూ ఓ చిన్న వివాదం చర్చనీయాంశమవుతోంది.
ఈ సినిమాకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనితో ఆయనకు ఓ అభిప్రాయ భేదం ఏర్పడింది. అది బయటకు రావడంతో సోషల్ మీడియాలో హీటై పోస్ట్లు, డిబేట్లు మొదలయ్యాయి. అయితే ప్రభాస్ మాత్రం తన సహజ శైలిలోనే — వివాదాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత, ఆయన వ్యక్తిగతంగా సందీప్ వంగాను ఫోన్ చేసి ఏం జరిగింది తెలుసుకున్నారు. కానీ ఆ విషయం లోకి తలదూర్చకుండా — “కాస్టింగ్ విషయంలో నీవే డెసిషన్ తీసుకో” అని చెప్పేశాడని తెలుస్తోంది. తద్వారా తన వైపు నుంచి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా స్మూత్గా వ్యవహరించారు.
ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ అనే సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక స్పిరిట్ చిత్రం అక్టోబర్ నుండి షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయి. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.
ఫైనల్ గా చెప్పేదేంటంటే — ప్రభాస్ స్టార్డమ్ ఒక్క యాక్షన్ సీన్లకోసమే కాదు, ప్రశాంతమైన వ్యక్తిత్వం కోసమూ అనేది నిజం. అందుకే ఆయనకు అభిమానులు ఎక్కువ!