ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్లానింగ్ అంటేనే ఎప్పుడూ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అటు ‘పుష్ప 2’ రికార్డులను వేటాడుతూనే, ఇటు తన బిజినెస్ సామ్రాజ్యాన్ని కూడా శరవేగంగా విస్తరిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ – గౌతమ్ తిన్ననూరి కలయికలో ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. అయితే, ఇది మీరు ఊహించినట్టుగా ఒక వెండితెర సినిమా మాత్రం కాదు!
అల్లు సినిమాస్ ప్రమోషన్స్ బాధ్యత ‘జెర్సీ’ డైరెక్టర్దే!
కోకాపేటలో అల్లు అరవింద్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ ఇప్పుడు హైదరాబాద్లోనే హాట్ టాపిక్. సంక్రాంతి కానుకగా ప్రారంభం కాబోతున్న ఈ థియేటర్ ప్రమోషన్ల కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. ఈ మల్టీప్లెక్స్ గ్రాండియర్ను ప్రపంచానికి చాటిచెప్పేలా రెండు భారీ కమర్షియల్ యాడ్స్ ప్లాన్ చేశారు. ఇందులో మొదటి యాడ్ను డైరెక్ట్ చేసే బాధ్యతను ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరికి అప్పగించారు.
హైదరాబాద్లోనే షూటింగ్.. పక్కా మాస్టర్ ప్లాన్!
విజయ్ దేవరకొండతో ‘కింగ్డమ్’ లాంటి భారీ యాక్షన్ డ్రామా తీసిన గౌతమ్, ఇప్పుడు అల్లు అర్జున్ స్టైల్ను తన మేకింగ్తో ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలి. వచ్చే వారం హైదరాబాద్లోనే ఈ ప్రమోషనల్ యాడ్ షూటింగ్ జరగనుంది. బన్నీ తన సినిమా ప్రమోషన్లకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలిసిందే.. మరి ఇప్పుడు తన సొంత థియేటర్ కోసం ఇంకెంత రేంజ్లో హంగామా చేస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
అల్లు సినిమాస్ ప్రత్యేకం ఏంటి?
కోకాపేటలో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి. అందులో ఒక స్క్రీన్ను అత్యంత ఖరీదైన డాల్బీ అట్మాస్ (Dolby Screen) తో అమర్చారు. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని అందించేలా అల్లు అరవింద్ గారు భారీగా ఖర్చు చేశారు. ఈ లగ్జరీని జనాల్లోకి తీసుకెళ్లడానికే అల్లు అర్జున్ ఈ మాస్టర్ ప్లాన్ వేశారు.

