సినిమా వార్తలు

రోడ్ల మీద పోసే మగాళ్లకి నీతులు లేవా? శివాజీకి అనసూయ పచ్చిగా ఇచ్చిపడేసింది!

బుల్లితెర గ్లామర్ క్వీన్ అనసూయ, నటుడు శివాజీ మధ్య మొదలైన ‘డ్రెస్సింగ్’ వివాదం టాలీవుడ్‌లో చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. హీరోయిన్ల దుస్తులపై శివాజీ చేసిన వ్యాఖ్యలకు అనసూయ ఘాటుగా రియాక్ట్ అవ్వడం, ఆ తర్వాత నెటిజన్లు ఆమెను టార్గెట్ చేయడం గత పది రోజులుగా హాట్ టాపిక్‌గా నడుస్తోంది.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన అనసూయ.. ఈ వివాదంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూనే, శివాజీకి ఒక లాజికల్ కౌంటర్ ఇచ్చింది. ముఖ్యంగా రోడ్ల మీద మూత్రం పోసే మగాళ్ల ప్రస్తావన రావడంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

శివాజీపై అనసూయ యూటర్న్?

శివాజీ వ్యాఖ్యలపై మొదట ఓ రేంజ్‌లో ఫైర్ అయిన అనసూయ, తాజా లైవ్‌లో కొంచెం సాఫ్ట్ అయ్యారు. “శివాజీ గారు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ప్రజలు ఆయన మాట వినే స్థితిలో ఉన్నారు” అంటూ ఆయనపై గౌరవాన్ని ప్రదర్శిస్తూనే సెటైర్లు వేశారు.

మగవాళ్లకి ఆ ముక్క చెప్పలేకపోయారా?

“ఆడపిల్లల సేఫ్టీ కోసం శివాజీ గారు చెప్పిన ఉద్దేశ్యం మంచిదే కావచ్చు.. కానీ, అరే అబ్బాయిలు.. అమ్మాయిలను వాళ్లకు నచ్చినట్టు ఉండనివ్వండి అని మగవాళ్లకి ఒక్క మాట చెప్పి ఉంటే బాగుండేది” అంటూ చురకలు అంటించారు.

రోడ్ల మీద మూత్రం పోసే మగాళ్లపై కామెంట్!

ఓ నెటిజన్ “అమ్మాయిల డ్రెస్సుల గురించి మాట్లాడే మగాళ్లు, రోడ్ల మీద బహిరంగంగా మూత్రం పోస్తుంటే ఏమనాలి?” అని అడగ్గా.. అనసూయ “వామ్మో!” అంటూ రియాక్ట్ అయ్యారు.

మరో పది రోజులు నన్ను ఆడుకుంటారు!

“ఇప్పుడు నేను దానిపై (మూత్ర విసర్జన) రియాక్ట్ అయితే.. నన్ను మరో పది రోజులు ఆడుకుంటారు. వాళ్లకు నేను ‘స్టఫ్’ అయిపోతాను. అందుకే దీని గురించి మాట్లాడను” అంటూ చాకచక్యంగా సమాధానం ఇచ్చారు.

నా పరువు ఎక్కడికి పోలేదు..

“ప్రతి విషయంలో దూరి పరువు పోగొట్టుకుంటావ్” అన్న నెటిజన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు అనసూయ. “ఎవరి పరువు పోయింది? నా పరువు నా దగ్గరే ఉంది. కూసే వాళ్లే పరువు పోగొట్టుకుంటున్నారు” అని తేల్చి చెప్పారు.

నేను ‘కారణజన్మురాలిని’!

తన ఎనర్జీ రహస్యం ఏంటని అడిగిన ఫ్యాన్స్‌కు.. “నేను కారణజన్మురాలిని అనుకుంటున్నాను” అంటూ తనదైన స్టైల్లో సరదాగా నవ్వేశారు అనసూయ.

భర్త రియాక్షన్ ఏంటి?

ఇంత రచ్చ జరుగుతుంటే మీ భర్త ఏమంటారు? అన్న ప్రశ్నకు.. “ఆయన నీ ఇష్టం.. నీ రిస్క్ అని చెప్తారు. నాకు అలాంటి భర్త దొరకడం నా అదృష్టం. ఆయన్ని ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంచాలనుకుంటాను” అని వెల్లడించారు.

తప్పు జరిగితే తగ్గేదే లేదు!

ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. ఏదైనా తప్పు అనిపిస్తే మాత్రం కచ్చితంగా రియాక్ట్ అవుతానని, ఆ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

సేఫ్టీ వర్సెస్ ఫ్రీడమ్..

కేవలం ఆడపిల్లలకు నీతులు చెప్పడం మానేసి, సమాజంలో మగాళ్ల ప్రవర్తన మారాలని, అప్పుడే అసలైన సేఫ్టీ ఉంటుందనేది అనసూయ పరోక్ష ఉద్దేశ్యమని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.

సోషల్ మీడియాలో అనసూయ మేనియా!

ప్రస్తుతం అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. శివాజీ ఫ్యాన్స్ మరియు అనసూయ సపోర్టర్ల మధ్య మళ్ళీ యుద్ధం మొదలయ్యేలా ఉంది.

Similar Posts