క్రైమ్, హార్రర్ లాంటి జోనర్లలో వర్మ తన సత్తా చాటారు. అయితే, ఈసారి హార్రర్కు కామెడీని జోడించి ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు వర్మ తెలిపారు. తన నెక్స్ట్ మూవీ హార్రర్ కామెడీగా రానుందని.. సత్య, కౌన్, శూల్ వంటి సినిమాల తర్వాత విలక్షణ నటుడు మనోజ్ బాజ్పాయ్తో మరోసారి తాను సినిమా చేయబోతున్నట్లు వర్మ అనౌన్స్ చేశాడు.
ఇక ఈ సినిమా కథను కూడా ఆయన వెల్లడించారు. ప్రజలకు భయం వేస్తే పోలీస్ స్టేషన్కు వెళ్తారు.. కానీ, అదే పోలీసులకు దెయ్యం కారణంగా భయం వేస్తే.. వారు ఎక్కడికి వెళ్తారు.. అనేది ఈ సినిమా కథగా రానుందట.
తన తాజా చిత్రం ‘పోలీస్ స్టేషన్ మే భూత్’లో మనోజ్ బాజ్పాయ్ నటించనున్నట్లు రామ్గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈ టైటిల్కి ‘యూ కెనాట్ కిల్ ది డెడ్’ అనేది క్యాప్షన్.
After SATYA, KAUN and SHOOL I am thrilled to announce , me and @BajpayeeManoj are once again teaming up for a HORROR COMEDY a genre which neither of us did
— Ram Gopal Varma (@RGVzoomin) April 9, 2025
I have done horror , gangster, romantic , political dramas , adventure capers, thrillers etc but never a HORROR COMEDY…
‘‘హారర్, గ్యాంగ్స్టర్, రొమాంటిక్, పొలిటికల్, అడ్వెంచర్, థ్రిల్లర్స్… వంటి సినిమాలు చేశాను. కానీ ఇప్పటివరకు నేను హారర్ కామెడీ జానర్లో సినిమా చేయలేదు.
‘పోలీస్ స్టేషన్ మే భూత్’ హారర్ కామెడీ ఫిల్మ్. పోలీస్స్టేషన్లో ఓ భయంకరమైన ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్స్టర్స్ భూతాలు అవుతారు. దీంతో ఆ పోలీస్ స్టేషన్ హాంటెడ్ స్టేషన్గా మారిపోతుంది. మరి… ఈ గ్యాంగ్స్టర్ భూతాల నుంచి పోలీసులు ఎలా తప్పించుకుంటారు? అన్నదే ఈ సినిమా కథ’’ అని ‘ఎక్స్’ వేదికగా రామ్గోపాల్ వర్మ పేర్కొన్నారు.