24 ఫ్రేమ్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’. దీని కోసం ఓ 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అలాంటి మెగాప్రాజెక్ట్‌కి సంబంధించిన అత్యంత కీలక హార్డ్ డిస్క్ మిస్ అయిందని— అదే సంస్థలో పని చేస్తున్న ఆఫీస్ బాయ్ రఘు మరియు మహిళా సిబ్బంది సరిత దొంగిలించారంటూ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.

అయితే, ఈ దొంగతనంలో మామూలు చేతులు లేవంటున్నాడు నిర్మాత మంచు విష్ణు. ఎవరో “పెద్ద” వ్యక్తి ఈ చోరీకి స్కెచ్ వేసి, రఘు-సరితల్ని పావుల్లా వాడాడన్నది విష్ణు అనుమానం.

ఇది నిజంగా హార్డ్ డిస్క్ మిస్సింగ్…? లేక… స్క్రీన్ ప్లే డ్రామా..?

మరోవైపు మంచు మనోజ్ వర్గం మాత్రం విపరీతమైన ఆరోపణలు చేస్తున్నది. అసలు హార్డ్ డిస్క్ మిస్సవ్వలేదని, మంచు విష్ణే కావాలనే ఈ డ్రామా క్రియేట్ చేశాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు కారణం?

మే 30న మనోజ్ నటించిన ‘భైరవం’ సినిమా రిలీజ్. దానికి ముందు రోజుల్లో మనోజ్ పేరు మీడియాలో హల్‌చల్ అవుతుండటం మంచు విష్ణుకిష్టం కాకపోవచ్చన్నది వారి వాదన. అందుకే విష్ణు ఇటువంటి డ్రామాలు ఆడుతూ మీడియా దృష్టిని మరలించాలని చూస్తున్నాడంటున్నారు!

ముంబై నుంచి కోరియర్..? కొత్త అనుమానం

హార్డ్ డిస్క్‌నా, ప్యాకెట్ బిస్కెట్లా? ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న:ఒక 200 కోట్ల బడ్జెట్ సినిమా హార్డ్ డిస్క్‌ను ఓ సాధారణ కోరియర్‌లో పంపిస్తారా..?

అది కూడా ముంబై నుంచి…? దీని వెనక ఎలాంటి ప్లాన్ ఉందో తెలియాలంటే CBI విచారణ జరిపించాల్సిందే అన్నంతగా విషయాలు పతాక స్థాయిలో ఉన్నాయి.

కుటుంబ కలహాల ఫ్లాష్‌బ్యాక్

ఇది మొదటిసారి కాదు. గతంలో మంచు వారింట్లో జనరేటర్‌లో పంచదార వేసిన ఘటన, కార్లు మిస్ కావడం, విచిత్రమైన డైలాగ్స్ వంటి అనేక సంఘటనలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు వాటికి కొత్త హార్ట్ డిస్క్ ఛాప్టర్ కూడా జత కావడంతో, ‘మంచు ఫ్యామిలీ డ్రామా’ కి ఇండస్ట్రీ హుషారైంది!

పోలీసుల నివేదిక వచ్చే వరకు హాల్ట్!

మొత్తం విషయాన్ని ఫైనల్ గా చెప్పాలంటే – హార్డ్ డిస్క్ మిస్ అయిందా..? అయ్యి ఉంటే – ఎవరు చేశారు..? ఎందుకు చేశారు..? అన్నది పూర్తిగా తేలాలంటే పోలీసుల విచారణ ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే.

అయితే, ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు –

మంచు ఫ్యామిలీ కథ ఇప్పట్లో ఆగేది కాదు… స్క్రీన్‌ప్లే ఇంకెన్నో ట్విస్టుల్ని దాగి ఉన్నట్లు ఉంది!

, , ,
You may also like
Latest Posts from