‘పేదల పక్షాన నిలిచే పోరాటయోధుడు’ అనే బిరుదుతో గుర్తింపు పొందిన ఆర్. నారాయణమూర్తి, తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్‌లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ ఘాటుగా స్పందించారు.

నట్టికుమార్ మాట్లాడుతూ…“నారాయణ మూర్తితో నాకు వ్యక్తిగతంగా గౌరవభరితమైన అనుబంధం ఉంది. కానీ ఆయన గత కొంతకాలంగా ప్రభుత్వానుకూల వ్యాఖ్యలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. వైసీపీ హయాంలో సినిమా రంగానికి తీవ్ర అన్యాయం జరిగినా మౌనం వహించిన వ్యక్తి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు?” అని నట్టి ప్రశ్నించారు.

“పదవుల మార్చినవాడు.. వాణిని మార్చుకున్నాడా?”

జగన్‌ ప్రభుత్వం పెద్ద హీరోల సమక్షంలో ఏర్పాటు చేసిన సినీ సమావేశంలో చిరంజీవిని అవమానించగా కూడా నారాయణ మూర్తి స్పందించలేదని గుర్తు చేసిన నట్టి, “ఆ రోజు ఆయన గొంతు దాచుకున్నారు. చిన్న సినిమాల కోసం ఐదో షో కోసం పోరాడలేకపోయారు. కానీ ఇప్పుడు కార్పొరేట్ కుట్రల పేరుతో మాట్లాడుతున్నారు. ఇది ఎవరి స్క్రిప్ట్?” అని సూటిగా ప్ర‌శ్నించారు.

“పవన్‌ కళ్యాణ్‌కు వ్యతిరేకతే టార్గెటా?”
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం మరచిపోయేంతగా, ఆయనను విమర్శించడం వాస్తవాలను పట్టించుకోకుండా మాట్లాడడమేనని నట్టి అభిప్రాయపడ్డారు.

“ఇప్పటి ప్రభుత్వంలో టిక్కెట్ ధరలు, థియేటర్ల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకెళ్తున్నారు. కానీ ఆ సమయంలో పాప్ కార్న్ రేట్లు టిక్కెట్ కంటే ఎక్కువైనా మౌనం వహించిన నారాయణమూర్తి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు?” అని గట్టిగా నిలదీశారు.

“థియేటర్లు బంద్ చేయడం బ్రహ్మాస్త్రం అయితే… దాన్ని ప్రయోగించే ధర్మం ఉండాలి”

నోటీసు లేకుండా థియేటర్లు మూసివేస్తామన్న ప్రకటనను తప్పుబడుతూ, “ఇది కేవలం ఆపద్ధర్మ చర్య కాదు. ఇది కార్పొరేట్‌లకు వ్యతిరేకంగా అనే బాణం కాదు. ఇది ఒక రాజకీయ కుట్రకు వేదిక కావడం” అనే అనుమానం వ్యక్తం చేశారు నట్టి కుమార్.

“థియేటర్ బంద్ అంటే సామాన్య డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టాఫ్ బతుకుల మీద కొడిపడే దెబ్బ. ఇది ఆట కాదు. ఇది బ్రహ్మాస్త్రం. దాన్ని ప్రయోగించాలంటే ఓ విలువ ఉండాలి.”

గతాన్ని చూస్తే నిజాలు తెలుస్తాయి”

జగన్ హయాంలో చిన్న సినిమాలకు ఏం చేశారో నారాయణ మూర్తి చెప్పాలంటూ, “గత ప్రభుత్వంలో నోరు మెదపనివాడు, ఇప్పుడు న్యాయం పేరిట ప్రచారం ఎందుకు?” అని గట్టిగా నిలదీశారు.

“నిజంగా పేదల పక్షాన నిలబడతానంటే… ఎవరూ లేని సమయంలో మాట్లాడాలి. కానీ ఇప్పుడు మాత్రం నారాయణమూర్తి ఎవరి గొంతు వినిపిస్తున్నారు?” అంటూ నట్టికుమార్ గట్టిగానే స్పందించారు.

, ,
You may also like
Latest Posts from