బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు పేరు ఇటీవల డైరక్టర్ గా కాదు, వ్యక్తిగత కారణాల వల్లే ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. ఆయన – ప్రముఖ నటి సమంత మధ్య రిలేషన్ ఉందని,డేటింగ్ నడుస్తోందని మీడియా రూమర్స్ ఎప్పటికప్పుడు చుట్టుముట్టుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ సతీమణి శ్యామాలి(Shhyamali) సోషల్ మీడియాలో పెట్టిన స్టోరీలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
తాజాగా శ్యామాలి షేర్ చేసిన సందేశం:
‘‘నమ్మకం అనేది అన్నిటికంటే విలువైనది. ఒకసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరిగి పొందలేరు’’
ఈ పోస్ట్ కేవలం ఒక ఉద్బోధేనా? లేక పరిస్థితులకు ప్రత్యక్షంగా స్పందించిందా? అనే దానిపై నెటిజన్లు చర్చిస్తున్నారు.
రూమర్ల నడుమ ఆమె మెసేజ్లకు ప్రత్యేక ఆసక్తి
శ్యామాలి తరచూ ఇన్స్టాలో భావోద్వేగాత్మక స్టోరీలు, కోట్స్ షేర్ చేస్తూనే ఉంటారు. కానీ రాజ్ – సమంత మధ్య వ్యక్తిగత equation గురించి వార్తలు రావడం మొదలయ్యాక ఆమె పోస్ట్లపై ప్రజల దృష్టి ఎక్కువగా పడుతోంది.
ఇటీవల ఆమె పంచుకున్న మరో కోట్ ఇదే:
“కాలమే అన్నిటినీ బయటపెడుతుంది… కర్మ ఎప్పుడూ సమాధానం చెబుతుంది. విశ్వం నిశితంగా చూస్తూనే ఉంటుంది.”
ఈ వాక్యాల్లో ఆమె భావోద్వేగాల ప్రతిబింబముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో షేర్ చేసిన రాజ్తో చివరి ఫొటో…
శ్యామాలి చివరిసారి 2023లో రాజ్ నిడిమోరుతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఆ తర్వాత నుంచి ఇద్దరూ కలిసి కనపడకపోవడమే కాక, ఇటీవల వీరిద్దరూ విడిపోయారన్న వార్తలు కూడా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇందుకు neither రాజ్, nor శ్యామాలి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆమె పోస్ట్లను చూస్తుంటే, ఏదో మౌనంగా చెప్పాలనుకుంటున్నదీ అన్న భావన కొందరిలో నెలకొంటోంది.