సీతా దేవిగా ‘రామాయణ’లో కనిపించబోతున్న సాయి పల్లవి, హిందీ ఆడియన్స్ నుంచి కొంత ట్రోలింగ్‌ ఎదుర్కొంటున్నప్పటికీ, ఆమె బాలీవుడ్ కెరీర్ గట్టిగానే ముందుకెళ్తోంది. ఆమె బీటౌన్‌లోని తొలి సినిమా ‘Ek Din’ ఈ నవంబర్ 7, 2025న థియేటర్లలో విడుదల కాబోతుంది.

ఈ ప్రేమకథా చిత్రంలో జునైద్ ఖాన్ (ఆమిర్ ఖాన్ తనయుడు) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఆమిర్ ఖాన్ మరియు మంసూర్ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది వారి కలయికలో 17 ఏళ్ల తర్వాతి ప్రాజెక్ట్, గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘జానే తూ… యా జానే నా’ (ఇమ్రాన్ ఖాన్‌తో) నిర్మించారు.

ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ కథ 2011 లో వచ్చిన కొరియన్ మూవీ ‘వన్ డే’ ఆధారంగా ఉండొచ్చునని ఊహాగానాలు ఉన్నాయి. కానీ, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

2023 డిసెంబర్‌లో ముంబయిలో షూటింగ్ మొదలై, జపాన్‌లో జునైద్-సాయి పల్లవి జంటను పట్టిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

జునైద్ ఖాన్ నటించిన Netflix చిత్రం ‘మహారాజ్’ హిట్ కాగా, రెండో సినిమా ‘Loveyapa’ మాత్రం కమర్షియల్‌గా ఫెయిల్ అయింది. అయితే, ‘Ek Din’ అతడి స్టార్‌డమ్‌కు మళ్లీ ఊపునిస్తుందా? లేక ఇది కూడా మరో పరీక్షగా మిగిలిపోతుందా? నవంబర్‌కి సమాధానం దొరుకుతుంది.

సాయి పల్లవి – సీతగా, ప్రేయసిగా, స్టార్‌గా… బాలీవుడ్‌లో మొదటి అడుగు ఎలా పడుతుందో చూడాలి!

, , , ,
You may also like
Latest Posts from