ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో ఒక విడదీయరాని అధ్యాయం… వైఎస్ రాజశేఖర్ రెడ్డి – నారా చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న అనూహ్యమైన ఫ్రెండ్‌షిప్. ఇదే నేపథ్యంగా ప్రముఖ దర్శకుడు దేవకట్టా రూపొందిస్తున్న పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్‌ పేరు “మయసభ”.

ఆగస్టు 7 నుంచి సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్‌కు రానున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తోంది. ఇందులో 1990 దశకంలో ఆంధ్ర రాజకీయాలే కాదు, ముఖ్యంగా ఎన్టీఆర్‌, చంద్రబాబు, వైఎస్సార్ ల మధ్య చోటుచేసుకున్న కీలక సంఘటనలపై ఆసక్తికరమైన దృశ్యాలు ఉన్నాయి.

టీజర్‌ వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్‌తో ప్రారంభమవుతుంది. ఇందులో చంద్రబాబు ఎమ్మెల్యేలందరినీ రహస్యంగా హోటల్‌కి తరలించి, వైఎస్సార్‌కి ఫోన్ చేసి సాయంకోరడం చూపించారు. అప్పట్లో యువ నేతలుగా ఉన్న ఇద్దరిని ఇప్పటి నేతలుగా చూపిస్తూ గతం – వర్తమానం మధ్య సంఘర్షణను ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ల ద్వారా చూపించారు.

చంద్రబాబు నాయుడు పాత్రలో నటుడు ఆది పినిశెట్టి, వైఎస్ పాత్రలో చైతన్య రావు కనిపించనున్నారు. ఇద్దరి లుక్స్‌కీ కొత్తదనం ఉంది. ముఖ్యంగా ఈ డైలాగ్‌లు ఇప్పుడు హాట్‌టాపిక్:

“రైతు కులం పుట్టిన నీకెందుకు అబ్బాయి రాజకీయం..” – వైఎస్ పాత్ర
“వసూళ్లు చేసిన కులంలో పుట్టిన రౌడీ నీకెందుకయ్యా వైద్యం..” – నాయుడు పాత్ర

ఇలాంటి డైలాగ్‌లు చూస్తుంటే.. వెబ్ సిరీస్‌లో ఉన్న రాజకీయ పంచ్ ఎంత ఘాటుగా ఉంటుందో అర్థమవుతుంది. దేవకట్టా ఇలాంటి ఘాటైన రాజకీయ కథను తెరపై ఆవిష్కరించడంలో ఎప్పుడూ వెనకడుగు వేయడు.

ఇద Originally ఒక సినిమా ఐడియా. కానీ ఓటీటీ విస్తరణను దృష్టిలో ఉంచుకొని వెబ్ ఫార్మాట్‌గా మలిచారట. “ప్రజలే జడ్జ్” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో కాలేజ్‌ డేస్‌లో ఉండే ఫ్రెండ్‌షిప్ నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా మారిన వరకూ చంద్రబాబు, వైఎస్‌ ప్రయాణాన్ని చూపించనున్నట్టు తెలుస్తోంది.

ఇది కేవలం ఓ ఫిక్షనల్ డ్రామా అయినా.. రాజకీయ సెన్సిటివ్ అంశాలను నెరవేర్చేలా ఉందన్న అభిప్రాయాలు టీజర్‌ ద్వారా మొదలయ్యాయి. నిజమైన కథలమీద కొంత కల్పనతో తీసిన ఈ ప్రయత్నం తెలుగు రాష్ట్రాల్లో ఎంత extent‌కు ప్రభావం చూపుతుందో చూడాలి!

#Aadhi Pinisetty, #Congress, #MayaSabha, #Nara Chandra Babu Naidu, #TDP, #YS Rajasekhar Reddy, #YSRCP

By admin