సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నటుడు అలీ, ఎమ్మెల్యే రోజా, నటుడు మురళీమోహన్‌లను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించిన తీరు కొందరికి అసహనంగా మారింది. ఈ నేపథ్యంలో పలువురు రాజేంద్ర ప్రసాద్‌పై విమర్శలు గుప్పించగా, స్వయంగా ఆయన స్పందించారు.

ఓ ప్రెవేట్ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే —

“అలీ నా మాటల్ని సీరియస్ గా తీసుకోలేదు. ‘ఇది పెద్ద విషయం కాదు’ అని అలానే చెప్పారు కూడా. మళ్లీ నాకు ఫోన్ చేసి, ‘జరిగిపోయిన సంగతి మర్చిపోండి’ అన్నారు. అయినా నేను హర్ట్ అయ్యాను. ఈ అనవసర గందరగోళం వల్ల బాధ పడ్డాను” అని తెలిపారు.

అంతేకాదు, తన భవిష్యత్ మాటల విషయంలో రాజేంద్రప్రసాద్ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. “ఇప్పటివరకు నేను కొందరిని ‘నువ్వు’ అని పిలిచుండొచ్చు. కానీ ఇకపై నా చివరి శ్వాస వరకూ ఎవరికైనా ‘మీరు’ అని మాత్రమే సంభోదిస్తాను. మర్యాదగా మాట్లాడతాను. ఈ విలువను నేను ఎన్టీఆర్ గారి దగ్గరే నేర్చుకున్నాను” అని స్పష్టం చేశారు.

You may also like
Latest Posts from