టాలీవుడ్‌లో రీ రిలీజ్‌లు గత కొన్ని కాలాలుగా మంచి క్రేజ్ తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే. పాత సినిమాలు మళ్లీ థియేటర్స్‌లోకి రావడం వల్ల ఆ సినిమాలపై అభిమానుల ప్రేమ మరోసారి మరింతగా వెలుగులోకి వస్తోంది. ఈ ట్రెండ్ భారీ బ్లాక్‌బస్టర్లకి కొత్త జోష్, ఆడియెన్స్‌కి సంతోషాన్ని ఇస్తోంది. అలాంటి అవకాశంలో, మంచు విష్ణు హీరోగా, జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన 2007 హిట్ సినిమా ‘ఢీ’ను మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

మంచు విష్ణు కెరీర్‌కి క‌మ‌ర్షియ‌ల్ బ్రేక్ ఇచ్చిన ‘ఢీ’ మూవీ సీక్వల్ కోసం. మళ్లీ విష్ణు- శ్రీనువైట్ల కాంబినేషన్‌లో 2007 సంవత్సరంలో విడుదలైన ‘ఢీ’ సినిమా సూపర్ సక్సెస్ కావడమే గాక ప్రేక్షకలోకం మరువలేని చిత్రంగా నిలిచిపోయింది.

శ్రీహరి పాత్ర, బ్రహ్మానందం, సునీల్ లాంటి కామెడీ సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకుల మన్ననలు తెచ్చుకుంటున్నాయి. విష్ణు అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో తన కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది. ఇప్పుడు, జూన్ 6న ఈ పాత హిట్‌ను భారీ రీ రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ సిద్ధంగా ఉంది.

ఇక విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నా, ‘ఢీ’ రీ రిలీజ్ ద్వారా కూడా అభిమానులతో మరోసారి కలుసుకుంటున్నాడు. జూన్ 27న భారీగా విడుదల కానున్న ‘కన్నప్ప’కి ముందు ‘ఢీ’ రీ రిలీజ్ మరింత హైప్ ని తీసుకువస్తుందని ఆశిస్తున్నారు మేకర్లు.

ఈ రీ రిలీజ్ ట్రెండ్ సినిమా ప్రేమికులకు పాత జ్ఞాపకాలను తేవడమే కాక, కొత్త తరగతికి క్లాసిక్ సినిమాలను అనుభవించే అవకాశం ఇస్తోంది. అందుకే ఈ రీ రిలీజ్ సినిమాలు కూడా తక్కువ బడ్జెట్ లో పెద్ద స్క్రీన్ కాబట్టి, మంచి బాక్స్ ఆఫీస్ రిటర్న్స్ ఇస్తున్నాయి. ‘ఢీ’ కూడా అదే విధంగా, మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు, నిర్మాతలు అంచనా వేస్తున్నారు.

, , , , ,
You may also like
Latest Posts from