టాలీవుడ్ ‘లవర్ బాయ్’ ఉదయ్ కిరణ్ మరణించి ఏళ్లు గడుస్తున్నా, ఆయన జ్ఞాపకాలు మాత్రం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదిలంగానే ఉన్నాయి. తాజాగా ‘మనసంతా నువ్వే’ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వస్తున్న ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

వాలెంటైన్స్ డే గిఫ్ట్..!

2026 వాలెంటైన్స్ డే సందర్భంగా ‘మనసంతా నువ్వే’ సినిమాను భారీ ఎత్తున రీ-రిలీజ్ చేస్తున్నారు. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఈ రీ-రిలీజ్ వార్త విన్న అభిమానులు, సెలబ్రిటీలు ఎమోషనల్ అవుతున్నారు.

“ఆయన సినిమాలు చూస్తుంటే ఏడుపొస్తోంది!”

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో యాంకర్ కెవ్వు కావ్య…ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ.. “ఆయన పాటలు విన్నా, టీవీలో సినిమాలు కనిపిస్తున్నా కచ్చితంగా ఏడుపొచ్చేస్తుంది. ఈసారి థియేటర్‌లో సినిమా చూస్తుంటే ఇంకా ఎక్కువ ఎమోషనల్ అవుతాం. ఎందుకంటే.. ఉదయ్ కిరణ్ ఇప్పుడు మన మధ్య లేరు” అంటూ ఎమోషనల్ అయ్యారు.

ఉదయ్ కిరణ్ అంటేనే ఒక సాక్రిఫైస్!

ఇప్పటి జనరేషన్‌లో ‘రెబల్’ హీరోలు ఉండొచ్చు కానీ, ఉదయ్ కిరణ్ లాంటి ‘సాఫ్ట్ కార్నర్’ ఉన్న ‘బాయ్ నెక్స్ట్ డోర్’ హీరోలు లేరని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తన ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయకుండా, సైలెంట్‌గా త్యాగం చేసే ఆ పాత్రలు ఉదయ్ కిరణ్‌కు మాత్రమే సాధ్యం. అప్పట్లో అమ్మాయికి ‘ఐ లవ్ యూ’ చెప్పడానికి సంవత్సరాలు పట్టే ఆ కాలంలోని స్వచ్ఛమైన ప్రేమను మళ్ళీ థియేటర్లలో చూడబోతున్నాం.

మీరు కూడా మీ ప్రేమను దాచుకున్నారా?

ఉదయ్ కిరణ్ సినిమాల్లో లాగా తన ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయలేక, లోలోపలే బాధపడుతూ జీవితాలు గడిపేస్తున్న వారు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. ఈ సినిమా రీ-రిలీజ్ ఆ జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేయడం ఖాయం.

#25 Years of Manasantha Nuvve, #Anchor Kevvu Kavya, #Manasantha Nuvve, #uday kiran, #Valentine’s Day

By admin