బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తూ, రికార్డులను తిరగరాస్తున్న ‘ధురంధర్’ సినిమాకు ఊహించని బ్రేక్ పడబోతోందా? సినిమా రిలీజ్ ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఉలిక్కిపడుతున్నారు!
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టులో ఒక అత్యవసర పిటిషన్ దాఖలైంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమాపై నిషేధం విధించాలని కోరడం ఇప్పుడు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ భారీ యాక్షన్ డ్రామాకు పొలిటికల్ అడ్డంకులు ఎందుకు వచ్చాయి? హైకోర్టు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?

తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Model Code of Conduct) అమల్లో ఉంది. అయితే ‘ధురంధర్’ సినిమాలో ఉన్న రాజకీయ అంశాలు, ఒక వర్గానికి అనుకూలంగా ఉన్న సీన్లు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సినిమాలోని కొన్ని వివాదాస్పద సన్నివేశాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాయని, అందుకే ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని లాయర్ వాదించారు.

ఈ అత్యవసర పిటిషన్ను స్వీకరించిన మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్ ధర్మాసనం.. దీనిపై ఫార్మల్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. పిటిషన్ ఫైల్ అయిన వెంటనే దీనిపై విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. రణ్వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం ఇప్పటికే తమిళనాడులో మంచి వసూళ్లను సాధిస్తోంది. ఒకవేళ కోర్టు గనుక సినిమాను ఆపాలని ఆదేశిస్తే, నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

బాక్సాఫీస్ వద్ద పరుగు కొనసాగిస్తున్న ఈ చిత్రానికి కోర్టు తీర్పు ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి. ఎన్నికల కోడ్ పేరుతో సినిమాను ఆపడం సరైనదేనా? లేక ఇది సినిమాపై కావాలని చేస్తున్న కుట్రనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి!

