సోషల్ మీడియాలో ఈ రోజుల్లో ప్రతి పెద్ద హీరో వెనుక ఒక ‘యాంటీ ఫ్యాన్’ గ్రూప్ కనిపిస్తోంది. వాళ్లు కొత్త సినిమా విడుదలకు ముందు, మధ్యలో, ఆ తర్వాత కూడా వ్యతిరేక ప్రచారం చేయడం, తప్పుడు ప్రచారాలు పుట్టించడం ద్వారా హీరోలకు దెబ్బ తీయాలని చూస్తుంటారు. అలా దెబ్బ తీయబోతున్న వారిని ఎదుర్కోవటం కష్టమే. దాంతో చాలా మంది హీరోలు లైట్ అన్నట్లు వదిలేస్తారు. కానీ ధనుష్ మాత్రం ఇటీవల ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
తాజాగా చెన్నైలో జరిగిన పాన్ ఇండియా మూవీ ‘కుబేర’ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ధనుష్ తనకు వ్యతిరేకంగా వస్తున్న విమర్శలపై గట్టిగా స్పందించాడు. “నేను ఎప్పుడూ నా పూర్తి ప్రయత్నం చేస్తాను. నా సినిమాలపై నెలకి రెండు సార్లు కుట్రలు చేస్తూ ఉంటారు, కానీ మీరేమీ చేయలేరు. ఎందుకంటే నా అభిమానులు ఎప్పుడూ నాతో ఉంటారు,” అని ధనుష్ తెలిపారు. ఆయన ఈ సర్కస్లను మానాలన్నారు, ఎందుకంటే 23 ఏళ్లుగా తన వెనుక ఉన్న అభిమానుల ప్రేమే అతనికి నిజమైన బలం అని చెప్పారు.
ఇది కేవలం ధనుష్ కి చెందిన సమస్య మాత్రమే కాదు, ఈ రోజుల్లో అనేక మంది హీరోలకెదురవుతున్న సమస్యలకు ధనుష్ ఇచ్చిన వార్నింగ్ గా చెప్పాలి. హీరోలు తెర మీదే కాదు తెరన వెనకా నిజాయతీతో ఎదిరించే సాహసమైన వారిగా కనిపించాల్సిన టైమ్ వచ్చేసింది.