పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రక చిత్రం హరిహర వీరమల్లూ విడుదల మరల వాయిదా పడింది. జూన్ 12న థియేటర్లలో రావడం లేదని తాజాగా ప్రకటించారు. అయినప్పటికీ, ఈ చిత్రం ఎప్పుడైనా వచ్చినప్పుడూ భారీ విజయం సాధిస్తుందని చిత్ర టీమ్ నమ్మకంతో ఉన్నారు. ఈ నేపధ్యంలో చిత్రం దర్శకుడు ఏ.ఎం. జ్యోతికృష్ణ ఇటీవల మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం నిర్మాణ వివరాలు పంచుకున్నారు.

జ్యోతికృష్ణ మాట్లాడుతూ… సుమారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని చూసి పవన్ కల్యాణ్ కూడా మెచ్చుకున్నారన్నారు. “పవన్ సర్ ఈ సినిమాను మూడు సార్లు చూడటం మాత్రమే కాదు, చాలా ప్రశంసించారు. అసురణం పాట ఆయనకు చాలా ఇష్టం. 500 సార్లు చూసి ఉంటారు. ఆయనకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్. ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి ” అని జ్యోతికృష్ణ పేర్కొన్నారు.

చారిత్రక నేపథ్యం కావడంతో, ఆ కాలపు వాతావరణాన్ని వాస్తవానికి తగినట్టుగా తెరపై ప్రదర్శించేందుకు సినిమా టీమ్ ఎంతో శ్రమిస్తున్నదని చెప్పారు. “సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్, ప్రతి అంశం ఆ కాలానికి ఖచ్చితంగా సరిపోయేలా ఉండేందుకు ప్రతీ దానిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం” అని అన్నారు.

ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పై ప్రత్యేక దృష్టి పెట్టి విజువల్స్, సౌండ్ ఎలిమెంట్స్‌ మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రేక్షకులకు ఎన్నడూ చూడని ఎక్స్‌పీరియన్స్ అందించే దిశగా ప్రతీ ఒక్కరూ వెచ్చిస్తున్నారని సమాచారం.

ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

, , , ,
You may also like
Latest Posts from