టాలీవుడ్లో ఓ భారీ ప్రాజెక్టుపై ఇప్పుడు రచ్చే రచ్చ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం మ్యూజిక్, స్క్రిప్ట్ రెడీ అయిందని లాంగ్ బ్యాక్ ప్రకటించినా… హీరో మాత్రం లాక్ కాలేదు. తొలుత ఈ ప్రాజెక్ట్కి అల్లు అర్జున్ ఫిక్స్ అయినట్టు వార్తలు వచ్చాయి. “పుష్ప 2 తర్వాత బన్నీ – త్రివిక్రమ్” అంటూ ఫ్యాన్స్ ఫెస్ట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయినట్టు కన్పిస్తోంది.
“గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్!” – నాగవంశీ ట్వీట్తో ఊహాగానాల ఊపు
సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఇటీవల షేర్ చేసిన పోస్టు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. అందులో “కార్తికేయో మహాసేన శరజన్మా షడాననః” అంటూ ఎన్టీఆర్కి డెడికేట్ చేస్తూ, “నా మోస్ట్ ఫేవరెట్ బ్రదర్”, “గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్” అంటూ పెట్టిన క్యాప్షన్ – ఈ ప్రాజెక్ట్ ఎటు వెళ్తుందో డైరక్టర్ గానే చెప్తోంది.
నాగవంశీకి ఎన్టీఆర్ అన్నలా ఉండటం తెలిసిందే. ఈ క్లూలు అన్ని చూసాక అభిమానులు ఇప్పుడు “గాడ్ ఆఫ్ వార్” అనగానే ఒకటే ఫిక్స్ అయ్యారు — ఈ ప్రాజెక్ట్కి బన్నీ కాదు… ఎన్టీఆర్నే హీరో అని!
బన్నీ బిజీ, త్రివిక్రమ్ ట్రాక్ మార్చేశారా?
బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. దీంతో త్రివిక్రమ్ – బన్నీ ప్రాజెక్ట్ తాత్కాలికంగా వాయిదా పడిందని తెలుస్తోంది. ఇదే సమయంలో త్రివిక్రమ్ వెంకటేశ్, రామ్చరణ్ లాంటి హీరోలతోనూ లైన్లో ఉన్నట్టు ప్రచారం. కానీ ఇప్పుడు స్పాట్లైట్ మొత్తం ఎన్టీఆర్ పైనే పడింది.
సుబ్రహ్మణ్య స్వామి ఇతివృత్తం… ఎన్టీఆర్లో సెట్ అవుతాడా?
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ సినిమా కథ పూర్తిగా “సుబ్రహ్మణ్య స్వామి” నేపథ్యంలో నడవబోతోంది. అంటే డివోషన్, యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్ మిక్స్ అయిన డిఫరెంట్ నేరేషన్తో త్రివిక్రమ్ సరికొత్త స్టైల్ను అన్వేషిస్తున్నారన్నమాట.
ఎన్టీఆర్తో త్రివిక్రమ్ ఇప్పటికే ‘అరవింద సమేత’ రూపంలో ఓ గట్టి హిట్ అందుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ కాంబో తిరిగి వస్తే – ఇది కేవలం సినిమా కాదూ… సెట్స్ మీదే ఓ సంబరం అన్నమాట.
ఒక్కటి మాత్రం క్లియర్ — త్రివిక్రమ్ కథ, ఎన్టీఆర్ నటన, సుబ్రహ్మణ్య ఇతివృత్తం అన్నీ కలిస్తే… ఇది దేవతల సినిమా అనే కాదు, టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కి సంసిద్దం! ఫ్యాన్స్ మాత్రం మరో ‘అరవింద సమేత’ కాదు… ఇది పక్కా పాన్-ఇండియా మాస్ బొమ్మ అవుతుందంటున్నారు.