కొన్ని సినిమాలు ప్రారంభం ఘనంగానే ఉంటుంది. రిలీజ్ కే ఏళ్లు పడుతుంది. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం ‘ధృవ నచ్చితిరమ్'(తెలుగులో ధృవ నక్షత్రం ). 2017లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటివరకు థియేట్రికల్ రిలీజ్ కాలేదు. ఈ మూవీని గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు.

2018లో విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక అనివార్య కారణాలతో పాటు ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు ఏడేళ్లుగా ఈ మూవీ విడుదలకు మోక్షం మాత్రం లభించడం లేదు. గతేడాది కూడా రిలీజ్‌ అవుతుందని వార్తలొచ్చినా అలా మాత్రం జరగలేదు. అయితే ఈ చిత్రంలో మజాకా మూవీ హీరోయిన్ రీతూ వర్మ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై మరోసారి టాక్ వినిపిస్తోంది. అన్ని సజావుగా సాగితే ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుందని తాజా సమాచారం.

గతంలో నవంబర్ 24న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, రిలీజ్‌కు ఒక్కరోజు ముందు కోర్టు ఆర్డర్ వల్ల నిలిచిపోయింది. దర్శకుడు గౌతమ్ మీనన్ అప్పట్లో రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు 10:30 గంటలలోపు చెల్లించాల్సి ఉండటంతో రిలీజ్ నిలిపివేశారు.

ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం — ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్‌కు అంగీకారం లభించినట్టు సమాచారం. ఒక ఇన్వెస్టర్ చిత్రాన్ని చూసి, సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గౌతమ్ మీనన్ స్వయంగా తెలిపారు.

గౌతమ్ మీనన్ స్పందన:

“ఈ సినిమా విడుదలైన తర్వాతే నా తదుపరి ప్రాజెక్టును ప్రారంభిస్తాను. నటనకు కూడా ఏ ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు. ఈ సినిమా ఇన్వెస్టర్‌కి చూపించాం. ఆయనకి నచ్చింది. ప్రస్తుతం కొన్ని లీగల్ అంశాల్ని క్లియర్ చేస్తున్నాం. జూలై/ఆగస్ట్‌లో సినిమా విడుదల ఖాయం.”

ఈ సినిమా విడుదల కోసం గౌతమ్ మీనన్ వాయిదా వేస్తూనే ఉంటే, ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ ఆశ వదలకుండా ఎదురుచూస్తున్నారు.

నటీనటులు: చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, వినాయకన్, రీతూ వర్మ, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, మాయా ఎస్.కృష్ణన్, పార్థిబన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం: హారిస్ జయరాజ్.

, ,
You may also like
Latest Posts from