తెరపై హీరోయిన్ ఓరియెంటెడ్ కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే.. మరోవైపు ఓటీటీ వేదికగా భిన్నమైన కథలతో సత్తా చాటుతున్న హీరోయిన్ సమంత. ఇటీవలే ‘సిటాడెల్’తో ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ‘రక్త్బ్రహ్మాండ్’. ది బ్లడీ కింగ్డమ్ అనే టైటిల్ తో ఓ సిరీస్ కోసం ఫాంటసీ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతోందంటూ వార్తలు వచ్చాయి. ‘తుంబాడ్’ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకుడు. అయితే ఇప్పుడు ఈ సీరిస్ ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి.
నెట్ఫ్లిక్స్ ఇండియా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ ఫాంటసీ వెబ్సిరీస్ ‘రక్త బ్రహ్మాండ్ – ది బ్లడి కింగ్డమ్’ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక గందరగోళంలో చిక్కుకుపోయింది. షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే, ఫైనాన్స్ మిస్యూజ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ వెబ్సిరీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్పై ఆర్థిక పరమైన ఆరోపణలు నమోదవడం ప్రాజెక్ట్ కొమసాగటంపై అనుమానాలు వస్తున్నాయి.
ఈ ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత కూడా షూటింగ్ తిరిగి ప్రారంభం కాలేదు. నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ను “ఇన్డెఫినిట్ పాజ్” లో పెట్టేసిందని, అనధికార సమాచారం చెబుతోంది. షూటింగ్కు గానూ ఖర్చైన మొత్తం, ఇప్పటి వరకు పూర్తి చేయాల్సిన పనుల్ని పోల్చి చూసినపుడు, నెట్ఫ్లిక్స్కు ఈ ప్రాజెక్ట్ ఒక “హై-రిస్క్ వెంచర్” గా మారినట్లు తెలుస్తోంది.
సుమారు రెండు వారల క్రితం, నెట్ఫ్లిక్స్ సీనియర్ టీమ్ నిర్మాతలు రాజ్ & డీకేతో కలిసి ఓ క్లోస్ డోర్ మీటింగ్ నిర్వహించింది. కొత్త ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఆమిర్ ఖాన్, ఫర్హాన్ అఖ్తర్ వంటి స్టార్స్తో పనిచేసిన అనుభవజ్ఞుడిని నియమించగా, అతని పర్యవేక్షణలో మొత్తం బడ్జెట్ను మళ్లీ సమీక్షించారు. కానీ నిజమైన ఖర్చు మరియు ఇప్పటి వరకు జరిగిన వృధా ఖర్చు పోల్చి చూసినపుడు, ఈ ప్రాజెక్ట్ను కొనసాగించడం నెట్ఫ్లిక్స్కు లాభదాయకంగా అనిపించలేదట.
2024 జూలైలో ఎంతో అట్టహాసంగా అనౌన్స్ చేసిన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు shelves దిశగా పయనిస్తోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక సమంత కెరీర్లో ఇది ఓ కీలక మలుపు కావాల్సి ఉండగా, ఇప్పుడది ఊపిరాడని పరిస్దితిలా మారిపోయిందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది.