తమిళ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసులు కూడా దోచేస్తున్నాడు. ‘సార్’ సినిమా సక్సెస్‌తో తెలుగులో మంచి మార్క్ వేసుకున్న ఈ నటుడు, తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘కుబేర’తో మరో హిట్ కొట్టాడు. తెలుగు బాక్సాఫీస్ దగ్గర ‘కుబేర’ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుండగా, తమిళ, హిందీ వెర్షన్లు మాత్రం నిరాశపరిచాయి.

ఇంతవరకూ తెలుగు ప్రేక్షకులు ధనుష్‌ను ఏక్సెప్ట్ చేసారు. ఇప్పుడు ధనుష్ మరింత స్ట్రాంగ్ గా తెలుగు ఇండస్ట్రీపై దృష్టిపెడుతున్నాడు. ఇప్పటికే ‘సార్’ దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన ఓ లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. ఆ సినిమా 2027లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అంతవరకూ ధనుష్ తమిళ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తాడు. మరో ప్రక్క వెంకీ అట్లూరి తను సూర్యతో చేస్తున్న సినిమాని పూర్తి చేస్తారు.

ఈ మధ్యే తన ఒక ఇంటర్వ్యూలో ధనుష్ ఓ క్లారిటీ ఇచ్చాడు – “నేను మంచి కథ వస్తే భాష తేడా లేకుండా నటిస్తాను. తెలుగు పరిశ్రమలో మంచి కథలుంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. నేను రెడీ.” అని చెప్పడం గమనార్హం.

మొత్తానికి… తమిళ హీరోగానే కాకుండా, ఇప్పుడు తెలుగులోనూ తనకంటూ అభిమానులను సంపాదించుకుంటున్న ధనుష్… టాలీవుడ్‌లో మరిన్ని ఆసక్తికరమైన ప్రయోగాలకు సిద్ధమవుతున్నాడు.

You may also like
Latest Posts from