శేఖర్ కమ్ముల ఎంతో గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “కుబేరా” ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికర చర్చకు కేంద్రంగా మారింది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న వంటి స్టార్ నటులతో ఈ సినిమా రూపొందుతున్న నేపథ్యంలో, ట్రైలర్ విడుదల తర్వాత క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. అయితే అందుకు తగ్గట్లు బుక్కింగ్స్ మాత్రం కనపడటం లేదు.
“కుబేరా”కి శేఖర్ కమ్ముల సినిమా స్థాయి హైప్ ఎందుకు కనిపించడం లేదు? అదే ఇప్పుడు టాలీవుడ్లోని హాట్ టాపిక్.
ఒకవైపు క్లాస్ ఆడియెన్స్ను విపరీతంగా ఆకట్టుకునే శేఖర్ కమ్ముల టేకింగ్… మరోవైపు మల్టీస్టారర్ కాంబినేషన్. ధనుష్ నటనకు విలువ తెలిసినవాళ్లైతే, నాగార్జునను తెరపై మళ్లీ మాస్ అవతారంలో చూడాలని ఎదురుచూస్తున్నారు. రష్మిక వంటి బిజీ హీరోయిన్ కూడా ఉంది.
ఇంత భాక్సాఫీస్ ని రెచ్చకొట్టే కాంబినేషన్ ఉన్నప్పటికీ, “కుబేరా”కు హంగామా తక్కువగానే ఉంది.
ఎందుకంటే… ఈ సినిమా ప్రమోషన్లలో ఓ కీలక లింక్ మిస్సయింది – పాటలు. తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ మ్యూజిక్తో ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. హిట్ పాటలు ముందుగా రిలీజ్ అయితే, సినిమా మీద క్రేజ్ దూకుడుగా పెరుగుతుంది. కానీ “కుబేరా” పాటలు అంతగా దృష్టి ఆకర్షించలేకపోయాయి.
ఈ స్థితిలో, సినిమా విజయం పూర్తిగా టాక్ మీద ఆధారపడి ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైనప్పటికీ, అవి ఇప్పటివరకు డీసెంట్ స్థాయిలోనే ఉన్నాయి. కానీ శేఖర్ కమ్ముల టీం మాత్రం కథపై పూర్తి నమ్మకంతో ఉంది.
ఇప్పుడు అసలైన ఎదురుచూపు డే వన్ రివ్యూస్దే. అవే సినిమా రేంజును నిర్ణయిస్తాయి.
“కుబేరా” జూన్ 20న థియేటర్లలోకి అడుగుపెడుతోంది.